Chiranjeevi ని వైఎస్ జగన్ అవమానించలేదు.. ఆ రోజు జరిగిందందే.. నటుడు ఆలీ వివరణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య కొనసాగుతున్న వివాదాలను పరిష్కరించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చిరంజీవితోపాటు ప్రభాస్, మహేష్ బాబు, కొరటాల శివ, ఎస్ఎస్ రాజమౌళి, నిరంజన్ రెడ్డి, ఆలీ, పోసాని కృష్ణ మురళి భేటి అయ్యారు. అయితే సినీ ప్రముఖులను సరైన విధంగా గౌరవించలేదు. అలాగే వారిని స్వాగతించడంలో వివక్ష చూపారనే విషయాలు మీడియాలో రాద్దాంతం అయ్యాయి. అయితే తాజాగా ఏపీసీఎం ను కలిసిన ఆలీ పలు అంశాల గురించి వివరణ ఇస్తూ..
Recommended Video

చిరంజీవిని అవమానించారంటూ..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో 10 తేదీన సినీ ప్రముఖుల భేటీ సందర్భంగా చిరంజీవిని అవమానించారనే విమర్శలు సరైనవి కాదు. చిరంజీవిని ప్రభుత్వం అవమానించలేదు. ఆయనకు అవసరం లేదు. సరైన గౌరవం ఇచ్చి లోనికి తీసుకెళ్లారు. ఈ అంశం గురించి రాసుకొనే వాళ్లు రాసుకొన్నారు. దానిని అంతటితో వదిలేయాలని ఆలీ అన్నారు.

చిరంజీవిని ఆహ్వానించి భోజనం పెట్టారు..
గతంలో చిరంజీవి ఒక్కరు వచ్చినప్పుడు.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాదరంగా ఆహ్వానించి తీసుకెళ్లారు. ఇంట్లోకి తీసుకెళ్లి భోజనం పెట్టారు. ఆ తర్వాత సినీ పరిశ్రమ గురించిన సమస్యలను చర్చించారు. మరికొందరితో మళ్లీ వస్తానని చిరంజీవి అంటే.. సీఎం సరేనని అన్నారు. ఆ క్రమంలోనే 10వ తేదీన భేటీ జరిగింది. ఈ భేటీ సందర్భంగా సినీ ప్రముఖులను స్వయంగా ఆహ్వానించలేదని విపక్షాలు చేస్తున్న ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరో రాశారు.. దాని గురించి ఆలోచించాల్సిన పనిలేదు అని ఆలీ అన్నారు.

నేను ప్రచారం చేసిన ఎమ్మెల్యేలతో
గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశాను. నేను ప్రచారం చేసిన ఎమ్మెల్యేలను ఈ సందర్భంగా కలిశాను. మంత్రులు కొడాలి నాని, కన్నబాబు, ఇతర మంత్రులను కలిశాను. నేను పదవి ఆశించి పార్టీలో చేరలేదు. పదవి రాలేదని విషయంలో నాకు అసంతృప్తి ఉందనే వార్తల్లో నిజం లేదు అని ఆలీ అన్నారు.

రెండు వారాల్లో గుడ్ న్యూస్
ఏపీ ప్రభుత్వంలో కీలక పదవి వచ్చినా.. రాకపోయినా రాజకీయాల్లో ఉంటాను. నేను 1999లో రాజకీయాల్లోకి వచ్చాను. ఇండస్ట్రీలో 43 సంవత్సరాలు, రాజకీయాల్లో 23 సంవత్సరాల అనుభవం ఉంది. అయితే నేను ఊహించిన పదవి ఇస్తారా? లేదా మరే పదవి వస్తుందా అనే విషయంపై నన్ను అడగకూడదు. రెండు వారాల్లోనే గుడ్ న్యూస్ వింటారు అని ఆలీ చెప్పారు.

కొద్ది రోజుల్లోనే సమస్య పరిష్కారం
సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే ఏపీ ప్రభుత్వం పరిష్కరిస్తుంది. కొద్ది రోజుల క్రితం జరిగిన చర్చల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. కొద్ది రోజుల్లో సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తుంది. ఈ రోజు (ఫిబ్రవరి 15) భేటి మాత్రం పూర్తిగా వ్యక్తిగతమైనది. నా పెళ్లి రోజున సీఎం గారిని కలిసి ఆశీర్వాదం తీసుకోవాలనుకొన్నాం. కానీ కుదర్లేదు. ఈ రోజు అపాయింట్మెంట్ లభించింది. నా భార్యతో కలిసి వచ్చాను అని ఆలీ చెప్పారు.


Click it and Unblock the Notifications











