Just In
- 15 min ago
‘రాధే శ్యామ్’ టీజర్ డేట్ ఫిక్స్: అదిరిపోయే స్పెషల్ డేను లాక్ చేసిన ప్రభాస్
- 27 min ago
ప్రభాస్ 'సలార్' హీరోయిన్ ఫిక్స్.. పుట్టినరోజు కానుకగా అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన టీమ్
- 47 min ago
2021 మొత్తం మెగా హీరోలదే హవా.. నెవర్ బిఫోర్ అనేలా బాక్సాఫీస్ పై దండయాత్ర
- 1 hr ago
‘పుష్ప’ నుంచి ఊహించని సర్ప్రైజ్: ఈ రెండింటిలో ఒకటి గ్యారెంటీ.. ముందే బయటకొచ్చిందిగా!
Don't Miss!
- News
ఇరుకునపడ్డ బీజేపీ.. వాళ్లెవరో తేల్చాల్సిందే.. నేతాజీ జయంతి వేడుకలో ఆ నినాదాలపై ఆర్ఎస్ఎస్ రియాక్షన్
- Sports
ఓ ఇంటివాడైన విజయ్ శంకర్
- Automobiles
భారత్ బెంజ్ ప్రవేశపెట్టిన 8 కొత్త వాహనాలు, ఇవే.. చూసారా..!
- Finance
దటీజ్ టీసీఎస్, ప్రపంచ బ్రాండ్లలో 3వ స్థానం, కాగ్నిజెంట్ను వెనక్కి నెట్టిన ఇన్ఫోసిస్
- Lifestyle
శరీర బరువును వేగంగా తగ్గించే ఈ పుదీనా టీని ఎలా తయారు చేయాలి??
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జూ ఎన్టీఆర్ రాకుండా కుట్ర, అతడో జోకర్ ....నటి తులసి సంచలనం!
హైదరాబాద్: గత రెండు దఫాలుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో జరుగుతున్న రాజకీయాలు సాధారణ ప్రేక్షకులను విస్మయానికి గురి చేస్తున్నాయి. అప్పట్లో రాజేంద్రప్రసాద్ ఎన్నిక సమయంలో జరిగిన రచ్చ ఇప్పటికీ ఇంకా ఎవరూ మరిచిపోలేదు.
తర్వాత 'మా' అధ్యక్ష పీఠాన్ని నటుడు శివాజీ రాజా దక్కించుకున్నారు. మరో దఫా రాజేంద్రప్రసాద్ కొనసాగాల్సి ఉన్నా శివాజీ రాజా తెర వెనక రాజకీయాలు చేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో అలిగిన రాజేంద్రప్రసాద్.... 'మా'తో అంటీ ముట్టనట్లు ఉంటున్నారని టాక్. తాజాగా శివాజీ రాజా వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ అయింది.

శివాజీ రాజాపై సంచలన ఆరోపణలు
‘శంకరాభరణం' సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి తులసి తాజాగా ‘మా' అధ్యక్షుడు శివాజీరాజాపై తీవ్ర ఆరోపణలు చేశారు. అతణ్ని ఓ జోకర్గా అభివర్ణించారు.

శివాజీ రాజా కుట్ర చేశాడు
తాను తలపెట్టిన శంకరాభరణం అవార్డుల కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీయార్ను రాకుండా కుట్ర చేసింది శివాజీరాజా అని తులసి ఆరోపించారు. నటి తులసి ‘శంకరాభరణం' పేరిట ప్రతీ ఏటా ఉత్తమ నటన కనబరిచిన వారికి అవార్డులు అందజేస్తున్న సంగతి తెలిసిందే.

బోసిపోయిన వేడుక
ఇటీవల హైదరాబాద్లో శంకరాభరణం అవార్డుల వేడుక నిర్వహించగా...ఆ వేడుకకు ఎన్టీయార్తోపాటు పలువురు సెలబ్రిటీలను ఆహ్వానించారు తులసి. అయితే వారెవరూ ఆ వేడుకకు రాలేదు. దీంతో ఆ వేడుక కాస్తా బోసిపోయింది.

ఎదగకుండా పన్నాగాలు
తాను నిర్వహిస్తున్న ఈ అవార్డులకు ప్రముఖులు వస్తే తన స్థాయి మరింత పెరుగుతుందనే ఉద్దేశ్యంతో ఎవరూ ఈ అవార్డుల వేడుకకు రాకుండా శివాజీ రాజా పన్నాగాలు పన్నారని, వారు రాకపోవడానికి కారణం ‘మా' అధ్యక్షుడు శివాజీరాజాయేనని తులసి ఆరోపించారు.

జూ ఎన్టీఆర్ గురించి చెబుతూ కంటతడి పెట్టిన ప్రముఖ నటి!
ప్రముఖ తెలుగు నటి, తల్లి పాత్రలతో అలరిస్తున్న తులసి... ఇటీవల ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జూ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే ఆమె కంటతడి పెట్టారు.