Don't Miss!
- News TTD: తిరుమలలో ఆ సేవలు రద్దు, శ్రీరాముడి ఊరేగింపుకు ప్రత్యేక ఏర్పాట్లు
- Sports Gautam Gambhir: నిద్రలో కూడా ఆర్సీబీనే కలవరిస్తా..! వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
వీళ్ళు ఫ్యాన్సా?: చుట్టుముట్టి ఆదాశర్మ ని టచ్ చేయాలని...
హైదరాబాద్ : సమంత, తాప్సీ, హెబ్బా పటేల్ ఈ మధ్యకాలంలో ప్రెవేట్ ఈవెంట్స్ లో చుట్టూ మూగిన అభిమానులమటూ మూగిన జనంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అలాంటి సమస్యే అదాశర్మకు ఎదురైంది. తన తాజా చిత్రం క్షణం ప్రమేషన్ కోసం షాపింగ్ మాల్ కు వెళ్లిన ఆమెకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది.
దాదాపు ఇరవై మంది సెక్యూరిటీ ఉన్నా చుట్టూ చేరిన జనాలని కంట్రోలు చేయలేకపోయారు. చాలా మందిని ఆమె దగ్గరగా వెళ్లాలని ముట్టుకోవాలని ఆత్రతపడటంతో ఆమె ఇబ్బందుల్లో పడింది. కొందరైతే అంతపనీ చేసారు. ఈ సంఘటనతో కంగారు పడ్డ అదా శర్మ ..వెంటనే ఎయిర్ పోర్ట్ కు వచ్చి హైదరాబాద్ ప్లైట్ ఎక్కేసింది.
హార్ట్ ఎటాక్ చిత్రంతో పరిచయమై, రీసెంట్ గా గరం, క్షణం చిత్రాలతో పలకరించిన భామ అదాశర్మ. అదాశర్మ నటించిన క్షణం చిత్రం మంచి సక్సెస్ కాగా ఆ ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకనేందుకు విజయవాడలోని ఓ షాపింగ్ మాల్కు వెళ్లింది. ఇక విజయవాడ వెల్లబోయే విషయాన్ని ముందుగా తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది ఆదా.
See u at Vijaywada PVP mall today evening !!💖💖💖💖💖💖 pic.twitter.com/Vnl1crSfTQ
— Adah Sharma (@adah_sharma) February 28, 2016
ఆదాశర్మ వస్తుందని తెలుసుకున్న అభిమానులు అక్కడికి భారీగా చేరుకోవటమే సమస్యగా మారింది. అటువంటి పరిస్ధితుల్లోనూ ఆదా అభిమానులతో అలాగే కాసేపు సందడి చేయగా తిరుగు ప్రయాణంలో విపత్కర పరిస్థితిని ఎదుర్కొందట. ఆదాను కలిసేందుకు కొందరు జనాలు ఆమె మీదకు దూసుకు రావడంతో వాళ్ళని కంట్రోల్ చేయలేక సెక్యూరిటీ చేతులు ఎత్తేయటమే సమస్యగా మారిందని చెప్తున్నారు.