Don't Miss!
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇద్దరు పిల్లల తల్లిని అయినా కూడా వేధించాడు.. నటుడిపై సింగర్ సంచలన ఆరోపణ!
పాకిస్తాన్ యువ నటుడు అలీ జాఫర్ బాలీవుడ్ లో కూడా కొన్ని చిత్రాల్లో నటించాడు. అతడిపై సింగర్ మిషా షఫీ (36) సంచలన ఆరోపణలు చేసింది. అలీ జాఫర్ తనని లైంగికంగా వేధించాడంటూ ఆరోపణ చేసింది. తాను ఇద్దరు పిల్లల తల్లిని అని కూడా చూడకుండా తనని తాకరాని చోట తాకుతూ వేదనకు గురిచేశాడని మిషా ఆరోపించింది. ఈ ఆరోపణలు చేస్తూ ఆమె ఇటీవల సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది.
దీనిపై నటుడు అలీ జాఫర్ స్పందించారు. మీ టూ ఉద్యమానికి తన మద్దత్తు ఉంటుందని తెలిపాడు. కానీ తాను ఓ పాపకు తండ్రిని అని, తన గురించి స్నేహితులకు, మిత్రులకు బాగా తెలుసు అని అలీ జాఫర్ అన్నాడు. కానీ తన గురించి ఇలాంటి ఆరోపణలు వస్తుంటే తట్టుకోలేకపోతున్నానని జాఫర్ వివరించాడు. అందుకే ఆమెపై న్యాయపరమైన పోరాటానికి దిగుతున్నానని ఆమెకి నోటీసులు పంపించడం విశేషం.
అలీ జాఫర్ పాక్ లో పలుచిత్రాల్లో నటించాడు. బాలీవుడ్ లో కూడా అతడు తేరె బిన్ లాడెన్, మేరీ బ్రదర్ కి దుల్హన్ వంటి చిత్రాల్లో నటించడం విశేషం. ప్రస్తుతం అతడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.