Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ఇండియాలో అత్యంత ఖరీదైన మూవీ టికెట్స్: లిస్టులో ‘బాహుబలి 2’ టాప్!
ఢిల్లీలోని పివిఆర్ థియేటర్ ఖరీదైన థియేటర్గా రికార్డులెక్కింది. ఈ థియేటర్లో సినిమా చూడాలంటే వేలల్లో చెల్లించాల్సిందే.
బాక్సాఫీసు వద్ద మూవీ కలెక్షన్ల విషయంలో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఏ హీరో సినిమా ఎక్కువ కలెక్షన్లు సాధిస్తే అంత గొప్ప. అభిమానులు కూడా ఈ విషయాన్ని చాలా ప్రెస్టీజియస్గా చెప్పుకుంటూ ఉంటారు.
ఇండియాలో ప్రతి ఏడాది వివిధ భాషల్లో ఎన్నో సినిమాలు విడుదలవుతుంటాయి. ఈ సినిమాల్లో బాలీవుడ్ ఖాన్ త్రయం నటించిన సినిమాలే కలెక్షన్ల విషయంలో టాప్ పొజిషన్లో ఉంటూ ఉంటాయి. ఈ కలెక్షన్ల వివరాలు పక్కన పెడితే.... తాజాగా ఇండియాలో అత్యంత కాస్లియెస్ట్ టికెట్స్ వ్యవహారం హాట్ టాపిక్ అయింది.
ఇండియాలో ఖరీదైన థియేటర్
ఇండియాలో అత్యంత ఖరీదైన సినిమా థియేటర్ ఏదైనా ఉంది అంటే... అది ఢిల్లీలోని ‘పివిఆర్ డైరెక్టర్స్ కట్' అనే థియేటర్. ఇందులో సినిమా చూడాలంటే వేలల్లో ఖర్చు పెట్టాల్సిందే. సినిమాకు ఉన్న డిమాండును బట్టి ఈ థియేటర్లో టికెట్స్ రేటు మారుతూ ఉంటుంది.
Recommended Video
బాహుబలి మూవీ టాప్
ఇప్పటి వరకు ఈ థియేటర్లో అత్యంత ఎక్కువ ధరకు టికెట్స్ అమ్మకానికి పెట్టిన సినిమాల్లో ‘బాహుబలి 2' మూవీ టాప్ పొజిషన్లో ఉంది. బాహుబలి 2 విడుదలైన సమయంలో డిమాండ్ భారీగా ఉండటంతో ఒక్కో టికెట్ రూ. 2400 ధరకు అమ్మారు. ఇండియాలో అఫీషియల్గా అత్యంత ఎక్కువ టికెట్ రేటు నమోదైన సినిమా ఇదే.
షారుఖ్ మూవీకి కూడా
త్వరలోనే విడుదల కాబోతున్న షారుక్ ఖాన్ మూవీ ‘జబ్ హ్యారీ మెట్ సెజల్' మూవీకి డిమాండ్ అదే స్థాయి ఉంది. ఇప్పటికే ఈ థియేటర్లో అడ్వాన్స్ బుకింగ్ మొదలయ్యాయి. ఒక్కో టికెట్ ధర రూ. 2400గా ఉంది.
రెండవ స్థానంలో ఐశ్వర్యరాయ్ మూవీ
ప్రభాస్ ‘బాహుబలి 2', షారుక్ ‘జబ్ హ్యారీ మెట్ సెజల్' తర్వాత ఐశ్వర్యరాయ్, రణబీర్ కపూర్ మూవీ ‘యే దిల్ హై ముష్కిల్' మూవీ అత్యంత ఎక్కువ ధర పలికిన సినిమాగా సెకండ్ ప్లేసులో ఉంది. ఈ సినిమా టికెట్ ‘పివిఆర్ డైరెక్ట్స్ కట్' థియేటర్లో రూ. 2200లకు అమ్మడయింది.
మూడో స్థానంలో సుల్తాన్
సల్మాన్ ఖాన్ నటించిన ‘సుల్తాన్' మూవీ పివిఆర్ డైరెక్టర్స్ కట్ థియేటర్లో ఒక్కో టిక్కెట్ రూ. 1800లకు అమ్ముడు పోయింది.
రయీస్
షారుక్ ఖాన్ నటించిన ‘రయీస్' మూవీ పివిఆర్ డైరెక్టర్స్ కట్ థియేటర్లో ఒక్కో టికెట్ రూ. 1500లకు అమ్ముడయింది.
ట్యూబ్ లైట్
ఇటీవల భారీ అంచనాలతో విడుదలైన సల్మాన్ ఖాన్ మూవీ ‘ట్యూబ్ లైట్' టికెట్ రూ. 1500లకు అమ్ముడయింది.