యూరప్కు అల్లు అర్జున్ ‘రేస్ గుర్రం’
హైదరాబాద్ : 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటించబోయే చిత్రం 'రేస్ గుర్రం'. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హీరోయిన్ గా శృతి హాసన్ హీరోయిన్. వక్కంతం వంశీ స్క్రిప్ట్ అందించిన ఈ సినిమాని నల్లమల్లపు బుజ్జి మరియు డా.వెంకటేశ్వర రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ చిత్ర షూటింగ్ జులై 1 నుంచి యూరప్ లో జరుగనుంది. యూరప్ ఖండంలోని వివిధ లొకేషన్లలో చిత్రీకరణ జరుపనున్నారు. ఇక్కడ ఈచిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ జరుగనుంది. యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది చివరిలో విడుదల కానున్నది.
ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పార్టు కొంత ఇప్పటికే హైదరాబాద్లో చిత్రీకరిచారు. ఆ షెడ్యూల్ పూర్తయిన తర్వాత యూరప్ లో షూటింగ్ ప్లాన్ చేసారు. ఇంతకు ముందు ఊరసవెల్లి చిత్రంలో జూ ఎన్టీఆర్ను స్టైలిష్గా ప్రజెంట్ చేసిన దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రంలో అల్లు అర్జున్ను సరికొత్తగా చూపించబోతున్నారు.
భారీ బడ్జెట్తో రూపొందుతున్న 'రేష్ గుర్రం' చిత్రానికి తమన్ సంగీతం అందించనున్నాడు. గతంలో సురేందర్ రెడ్డి, తమన్ కాంబినేషన్లో వచ్చిన 'కిక్' చిత్రం భారీ విజయం సాధించింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటింగ్ : గౌతం రాజు, కథ : వక్కతం వంశీ.


Click it and Unblock the Notifications











