Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
యూరప్కు అల్లు అర్జున్ ‘రేస్ గుర్రం’
హైదరాబాద్ : 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటించబోయే చిత్రం 'రేస్ గుర్రం'. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హీరోయిన్ గా శృతి హాసన్ హీరోయిన్. వక్కంతం వంశీ స్క్రిప్ట్ అందించిన ఈ సినిమాని నల్లమల్లపు బుజ్జి మరియు డా.వెంకటేశ్వర రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ చిత్ర షూటింగ్ జులై 1 నుంచి యూరప్ లో జరుగనుంది. యూరప్ ఖండంలోని వివిధ లొకేషన్లలో చిత్రీకరణ జరుపనున్నారు. ఇక్కడ ఈచిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ జరుగనుంది. యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది చివరిలో విడుదల కానున్నది.
ఈ చిత్రానికి సంబంధించిన టాకీ పార్టు కొంత ఇప్పటికే హైదరాబాద్లో చిత్రీకరిచారు. ఆ షెడ్యూల్ పూర్తయిన తర్వాత యూరప్ లో షూటింగ్ ప్లాన్ చేసారు. ఇంతకు ముందు ఊరసవెల్లి చిత్రంలో జూ ఎన్టీఆర్ను స్టైలిష్గా ప్రజెంట్ చేసిన దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రంలో అల్లు అర్జున్ను సరికొత్తగా చూపించబోతున్నారు.
భారీ బడ్జెట్తో రూపొందుతున్న 'రేష్ గుర్రం' చిత్రానికి తమన్ సంగీతం అందించనున్నాడు. గతంలో సురేందర్ రెడ్డి, తమన్ కాంబినేషన్లో వచ్చిన 'కిక్' చిత్రం భారీ విజయం సాధించింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటింగ్ : గౌతం రాజు, కథ : వక్కతం వంశీ.