Don't Miss!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అమితాబ్ నోట..కన్నడ పాట!
'అమృత ధారె" అనే కన్నడ చత్రంలో అమితాబ్ బచ్చన్ తో అతిధి పాత్ర పోషింపజేసిన కన్నడసీమ ఈ సారి ఓ కన్నడ చిత్రంలో ఆయనతో ఒక పాట పాడించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. సుప్రసిద్ద కన్నడ సంగీత దర్శకుడు హంసలేఖ ఈ బృహత్కార్యానికి సారధ్యం వహిస్తున్నారు. సౌందర్య జగదీష్ నిర్మిస్తున్న'అప్పు పప్పు" అనే చిత్రంలో ఓ పాటను అమితాబ్తోనే పాడించాలని ఆ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న హంసలేఖ విశ్వప్రయత్నం చేస్తున్నారు.
'ఈ విషయమై ఇప్పటికి రెండు పర్యాయాలు అమితాబ్ను కలిశాం. ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. మానవతా విలువలకు అద్దం పడుతూ, కిరాతక చర్యలను ఎండగడుతూ సాగే ఈ పాట..అమితాబ్ గంభీర గాత్రం నుంచి వస్తేనే బాగుంటుందని నా నమ్మకం. అందుకే ఎలా అయినా ఆయనతోనే ఆ పాటను పాడించాలని నేను చేసిన సూచనను నా నిర్మాతలు కూడా వెంటనే అంగీకరించడం ఆనందంగా ఉంది. ఇంక అమితాబ్ అంగీకారం కోసం ఎదురు చూస్తున్నాం" అంటున్నారు హంసలేఖ!