Don't Miss!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
బాలయ్య సినిమాపై బాలసుబ్రహ్మణ్యం కామెంట్స్
బాలయ్య రాముడి పాత్రలో రూపొందిన పౌరాణిక సినిమా 'శ్రీరామ రాజ్యం" ఇటీవల విడుదలై మంచి హిట్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బాలయ్య సీనియర్ ఎన్టీఆర్ పేరు నిలబెట్టారని, పౌరాణిక సినిమాలంటే కేవలం నందమూరి హీరోలే అని మరోసారి రుజువైందని అభిమానులు ఆంనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమాపై ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం తన మనసులోని మాటను బయట పెట్టారు. తన జీవితంలో కేవలం నాలుగైదు సందర్భాల్లో మాత్రమే ఆనంద పడ్డా. తాజాగా మళ్లీ నాకు ఆ ఆనందం శ్రీరామ రాజ్యం సినిమా చూసిన తర్వాత దక్కించింది అని పేర్కొన్నారు. ఈ సినిమా నాకు పునరుత్సాహాన్ని ఇచ్చిందని బాలు పేర్కొన్నారు. ఇంత అద్భుతమైన సినిమా రూపొందించిన బాపు గారికి పాదభివందం చేస్తున్నా, తెలుగుజాతి ఆయనకు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. అదేవిధంగా బాలయ్య, నయన తార, నాగేశ్వరరావు తదితరుల నటన అద్భుతంగా ఉందని బాలు ప్రసంసించారు.
పౌరాణిక సినిమా అయినప్పటికీ బాలయ్య కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ నేపథ్యంలో శ్రీరామ రాజ్యం సినిమా సూపర్ కలెక్షన్లతో దూసుకెలుతోంది. మరో హీరో నటించి ఉంటే సినిమాకు ఇంత హైప్ వచ్చేది కాదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా నయనతార నటన సినిమాకు హైలెట్ గా నలిచిందని, అభినవ సీతగా నయనతార అందరి మన్ననలు అందుకుంటోంది. శ్రీరామ రాజ్యం సినిమాను శ్రీసాయి బాబా మూవీస్ బ్యానర్ పై యలమంచిలి సాయిబాబు నిర్మించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు.