Don't Miss!
- News కవితకు బెయిల్ కోసం నిరీక్షణ తప్పదు; ఈడీ కేసులోనూ తీర్పు రిజర్వ్!!
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
డైరెక్టర్ మాయచేసాడు: నిజం బయట పెట్టిన అనుష్క!
హైదరాబాద్: అనుష్క ప్రధాన పాత్రలో 'భాగమతి' సినిమా వస్తోందంటూ గత కొంతకాలంగా మీడియాలో వార్తలు నలిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై ఇప్పటి వరకు సరైన క్లారిటీ లేదు. 'భాగమతి' అనే టైటిల్ చూసి ఇది చారిత్రక చిత్రమనే ఇంతకాలం భావించారు.
17వ శతాబ్దం రాజు కులీ కుతుబ్ షా, ఆయన భార్య భాగమతి స్టోరీ ఆధారంగానే ఈ సినిమా ఉంటుందని ఇంతకాలం ప్రచారం జరిగింది. ఇది హైదరాబాద్ చరిత్రతో ముడిపడి ఉన్న కథగా భావించి చాలా మంది ఈ ప్రాజెక్టుపై ఆసక్తి పెంచుకున్నారు.
అయితే తాజాగా 'భాగమతి' చిత్రానికి అంత సీన్ లేదని తేలిపోయింది. ఇది చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కాదు...మామూలు థ్రిల్లర్ మూవీ. ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోయే డైరెక్టర్ అశోక్(పిల్ల జమిందార్ ఫేం) కావాలనే ఇంతకాలం అసలు విషయం దాచి హైదరాబాద్ చరిత్ర మీద ప్రేక్షకులకున్న వీక్ నెస్ తో ఆడుకున్నాడు, తన ప్రాజెక్టు జనాల్లో బాగా నానాలని, పబ్లిసిటీ రావాలని మాయచేసాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనుష్క 'భాగమతి' ప్రాజెక్టుకు సంబంధించిన అసలు విషయం చెప్పింది. 'నేను చేస్తోంది కేవలం ఒక థ్రిల్లర్ సినిమా. 17వ శతాబ్దానికి చెందిన చరిత్ర అని చాలామంది అనుకుంటున్నారు. కాని ఇక్కడ అనుకున్న కథ వేరు. భాగమతి అనే అమ్మాయి చుట్టూ తిరిగే ఒక థ్రిల్లర్ సినిమా' అని తేల్చి చెప్పింది.