రాంచరణ్ తేజ...భాస్కర్ కాంబినేషన్ ?

పరుగు చిత్రానికి మొదట్లో ఆ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా, కలెక్షన్లు నిలకడగా వున్నాయి. అయినా ఆ సినిమాను భాస్కర్ రూపొందించిన తీరు చిరంజీవికి బాగా నచ్చిందిట. అలాగే ఇప్పటికే అతను చెప్పిన లైను చిరంజీవిని బాగా ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. దాంతో అంజనా ప్రొడక్షన్స్ నిర్మించే సినిమాకు అతన్నే దర్శకుడిగా తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. రాజమౌళితో చేస్తున్న సినిమా పూర్తయిన వెంటనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నది. దీని కోసం లవ్,యాక్షన్, ఫ్యామిలీ డ్రామా మేళవించిన కథను భాస్కర్ సిద్ధం చేస్తున్నాడుట . గ్యాంగ్ లీడర్ తరహాలో తయారయ్యే ఈ సినిమాకు నాగబాబు నిర్మాత కాగా, చిరంజీవి సమర్పకునిగా వ్యవహరించనున్నారు. యేదైమైనా భాస్కర్ అదృష్టవంతుడు అంటున్నారు.


Click it and Unblock the Notifications











