ఎక్సపెక్ట్ చేయలేదు...బిగ్ గ్ గ్...ధాంక్స్: రాజమౌళి
రాజమౌళి, సునీల్ కాంబినేషన్ లో రూపొందిన మర్యాద రామన్న ఆడియో పంక్షన్ నిన్న(జూలై4) రాత్రి ఘనంగా శిల్పకళా వేదికలో జరిగిన విషయం తెలిసిందే. ఈ పంక్షన్ కు అటెండయిన వారందరికీ రాజమౌళి ట్విట్టర్ ద్వారా ధాంక్స్ చెప్పుకుంటున్నారు. ఇంతబాగా పంక్షన్ జరగటానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. అలాగే ఫీడ్ బ్యాక్ ఇచ్చిన వారందరికీ బిగ్ గ్ గ్...ధాంక్స్ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇక సునీల్ తో ఏడాదిపాటు పనిచేసాను. అతని స్పాటినటికి నేను చాలా ఆశ్చర్యపోతూంటాను.ఆడియో పంక్షన్ లో అతను మాట్లాడిన మాటలు చాలా బాగా ఉన్నాయి. గెస్ట్ లు కూడా చాలా స్పోర్టివ్ గా ఈ పంక్షన్ లో పాల్గొన్నారు. అలాగే మేము వెయ్యి మంది జనం వెబ్ ద్వారా లైవ్ చూస్తారని ఎక్సపెక్ట్ చేసాం. కానీ వారి సంఖ్య 3500 దాటింది. ఈ వెబ్ టెలీ కాస్ట్ అనేది ట్రెండ్ సెట్టర్ గా మారుతుందనికుంటున్నాము అన్నారాయన.


Click it and Unblock the Notifications











