Don't Miss!
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- News ఏపీలో కూటమికి వచ్చే సీట్లు ఇవే- రఘురామ తాజా అంచనా..!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
అసలు ఎక్కడ? మళ్ళీ మారిన 'బ్రహ్మోత్సవం' ఆడియో వేదిక
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన 'బ్రహ్మోత్సవం' సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపేందుకు, మే 7న హైద్రాబాద్లో ఆడియో విడుదలను చేపట్టనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ ప్రకటనతో మొదలైన బ్రహ్మోత్సవం సందడి, పీవీపీ టీమ్ చేపడుతోన్న ప్రచారంతో ఊపందుకుంది.
ఈ వేడుక వేదిక విషయంలో మార్పు జరిగినట్టు తాజా సమాచారం. మొదట్లో తిరుపతిలో అడియో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు, మళ్ళీ హైదరాబాలోని శిల్పకళా వేదిక ఆడిటోరియంలో నిర్వహిస్తారంటూ వార్తలొచ్చాయి. కానీ... ఇప్పుడు మళ్ళీ వేదిక మారింది జె.ఆర్.సీ కన్వెన్షన్ సెంటర్లో ఆడియో రిలీజ్ను చేపట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు.
మహేష్, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలల సూపర్ హిట్ కాంబినేషన్లో వస్తోన్న సినిమా కావడంతో 'బ్రహ్మోత్సవం'పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఊహించిన దానికంటే ఎక్కువ మంది అభిమానులు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఇలాంటి పరిస్థితిలో ఇదివరలోనే కొన్ని ఆడియో ఫంక్షన్లలో తొక్కిసలాటల వల్ల జరిగిన చేదు అనుభవాలను దృస్టిలో ఉంచుకోని వేదికను విశాలన్ గా ఉండే విఢంగా జె.ఆర్.సీ కన్వెన్షన్ సెంటర్ కి మార్చారని సమాచారం.. మిక్కీ జే మేయర్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోతో పాటు గా సినిమా థియేటరికల్ ట్రైలర్ను కూడా అదే రోజున విడుదల చేయనున్నారు....