Don't Miss!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- News సెంటిమెంట్ కలిసొస్తే - అదే ఫలితం రిపీట్...!!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
'బృందావనం' ని ఆ చిత్రంతో పోల్చద్దు...సమంత
'ఏం మాయ చేసావె' చిత్రంతో పరిచయమైన సమంతాను మరిచిపోవటం కష్టం. చూస్తూండగానే ఆమె రెండో చిత్రం 'బృందావనం' రిలీజ్ అయిపోయింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... 'ఏం మాయ చేసావె', 'బృందావనం' ..ఈ రెండు సినిమాల్నీ పోల్చి చూడవద్దు. జెస్సీ-ఇందూ రెండూ వేర్వేరు పాత్రలు. అయినా రొమాన్స్ అనేది ప్రతి పాత్రలోనూ ఉంటుంది. చీరకట్టులో ఎక్కువగానో, చుడీదార్ వేసుకొంటే తక్కువగానో కనిపించదు.
'బృందావనం'లోనూ నేను రొమాంటిక్గానే కనిపిస్తాను అలాగే అలాగే ఎన్టీఆర్ గురించి చెప్తూ... ఎన్టీఆర్ ప్రతిభను కొలవటానికి మాటలు చాలవు. అంకితభావం ఉన్న హీరో ఎన్టీఆర్. ఆయన డాన్స్ చేస్తుంటే చూడడం ఇష్టం. కానీ ఆయనతో కలిసి డాన్స్ చేయడం చాలా కష్టం. అదృష్టం కొద్దీ దీంట్లో నాకు మాస్ పాట ఒకటి దక్కింది. తెర మీద నేనెలా చేశానో చూసుకుందామనే కోరిక తీరలేదు. ఎందుకంటే చూపు ఎన్టీఆర్ డ్యాన్స్ నుంచి మరలడం లేదు. రిలీజు రోజునే హైదరాబాద్లో థియేటర్కి వెళ్లాను. అక్కడ ప్రేక్షకుల స్పందన ఎంతో ఆనందాన్నిచ్చింది అంది.