అమ్మ ఇకలేరు: రజనీకాంత్, అమితాబ్ సహా సినీ ప్రముఖుల సంతాపం
జయ మరణంపై పలువురు సెలబ్రిటీలు స్పందించారు. అమ్మకు ఆత్మకు శాంతి కలగాలని సినీ, రాజకీయ, క్రీడా రంగ ట్వీట్స్ చేసారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత (68) సోమవారం రాత్రి 11.30 గంటలకు కన్నుమూశారు. జయ మరణంతో తమిళనాడు రాష్ట్రం, అభిమానులు విషాదంలో మునిగిపోయారు. దాదాపు రెండు నెలలుగా అస్వస్థతతో వున్న ఆమె గుండెపోటుతో అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
జయ మరణంపై పలువురు సెలబ్రిటీలు స్పందించారు. అమ్మకు ఆత్మకు శాంతి కలగాలని సినీ, రాజకీయ, క్రీడా రంగ ట్వీట్స్ చేసారు. రజనీకాంత్ తమిళంలో ట్వీట్ చేసారు. కేవలం తమిళనాడు మాత్రమే కాదు, ఎంటైర్ నేషన్ జయలలిత మరణంతో శోక సముద్రంలో మునిగిపోయింది. మా గౌరవ ముఖ్యమంత్రి ఆత్మకు శాంతికలగాలి అంటూ రజనీకాంత్ ట్వీట్ చేసారు



Click it and Unblock the Notifications











