భావోద్వేగం: చిరు, మంచు లక్ష్మి, రాజమౌళి ఇలా...(ఫోటోలు)
హైదరాబాద్: తెలుగు సనిమా లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు లేరనే విషయాన్ని అభిమానులు, ప్రేక్షకులు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. 'మనం' చిత్రం రూపంలో ఆయన ఎప్పటికీ మన మధ్య జీవించే ఉంటారని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. ఇలాంటి భావోద్వేగమే 'మనం' చిత్రం వరల్డ్ ప్రీమియర్ షో సందర్భంగా పలువురు ప్రముఖుల నుండి వ్యక్తమయింది.
గురువారం సాయంత్రం 'మనం' ప్రీమియర్ షోకు హాజరైన సినీ ప్రముఖులు చిరంజీవి, రాజమౌళి, ప్రకాష్ రాజ్, రానా, రామ్ చరణ్, మంచు లక్ష్మి, అనుష్క, సమంత, అల్లు అర్జున్, స్నేహారెడ్డి తదితరులు ఈ సందర్భంగా అక్కినేని గురించి తమ మనసులోని భావాలను అక్షరాల రూపంలో బోర్డుపై రాసి వ్యక్త పరిచారు.
మనం చిత్రం ప్రీమియర్ షోకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

చిరంజీవి
‘మనం' చిత్రం ప్రీమియర్ షోకు హాజరైన చిరంజీవి, సురేఖ దంపతులు. చిత్రంలో రామ్ చరణ్ కూడా ఉన్నారు.

చిరంజీవి మనసులోని భావం
అక్కినేని గురించిన, మనం చిత్రం గురించి తన మనసులోని భావాలను చిరంజీవి ఇలా వ్యక్త పరిచారు.

అల్లు అర్జున్, స్నేహారెడ్డి
మనం ప్రీమియర్ షోకు హాజరైన అల్లు అర్జున్, స్నేహా రెడ్డి దంపతులు.

మంచు లక్ష్మి
తెలుగు సినిమా లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు గురించి తన మనసులోని భావాన్ని మంచు లక్ష్మి ఇలా బయట పెట్టారు.

రాజమౌళి
మనం సినిమా గురించి, అక్కినేని నాగేశ్వరరావు గురించి తన మనసులోని మాటలను వ్యక్త పరుస్తున్న రాజమౌళి.

సమంత
‘మనం' చిత్ర హీరోయిన్ సమంత హాట్ అండ్ సెక్సీ లుక్తో ప్రీమియర్ షోకు హాజరయ్యారు. అక్కినేని గురించి తన మసులోని మాటను ఇలా బయట పెట్టారు.

ప్రకాష్
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ‘మనం' చిత్రం ప్రీమియర్ షోకు హాజరయ్యారు.

అమల
మనం చిత్రం గురించి ఎంతో స్పెషల్ అంటూ అక్కినేని కోడలు అమల ఇలా తన మనసులోని మాట బయట పెట్టారు.

రానా
మనం చిత్రం ప్రీమియర్ షో సందర్భంగా రానా దగ్గుబాటి, నాగ చైతన్య ఇలా....

అనుష్క
మనం చిత్రం ప్రీమియర్ షోకు హాజరైన నటి అనుష్క, నిర్మాత ఎన్వీ ప్రసాద్.

శ్రీయ
మనం చిత్రం ప్రీమియర్ షోకు అదిరిపోయే హాట్ లుక్తో హాజరైన నటి శ్రీయ.

దర్శకుడు
మనం చిత్రం దర్శకుడు విక్రమ్ కుమార్ ప్రీమియర్ షో సందర్భంగా ఎఎన్ఆర్ గురించి బోర్డుపై రాసారు.

అమలతో బన్నీ దంపతులు
అక్కినేని అమలతో అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులు...


Click it and Unblock the Notifications











