Don't Miss!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- News చంద్రబాబు , భువనేశ్వరి ఆస్తుల్లో భారీ పెరుగుదల - 5 ఏళ్ల కాలంలోనే..!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
విజయశాంతి టైటిల్ తో ఛార్మి
దాదాపు ఫేడవుట్ దశలో ఉన్న ఛార్మి ఇప్పుడు మరో చిత్రం కమిటై చేస్తోంది. ఆ చిత్రంలో ఆమె జర్నలిస్టుగా కనిపిస్తోంది. ఒడిశాలో చోటుచేసుకొన్న ఓ సంఘటన ఆధారంగా దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. 'ప్రతిఘటన' అనే పేరుని నిర్ణయించారు.
ఇందులో ఛార్మి ప్రధాన పాత్ర పోషిస్తారని సమాచారం. ఆమె పోషించబోయేది పాత్రికేయురాలి పాత్ర. వర్తమాన సమాజంలో మహిళలపై సాగుతున్న అఘాయిత్యాలు, రాజకీయాల నేపథ్యంగా సాగే కథ ఇది. ఇప్పటికే కథ సిద్ధమైంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు వెల్లడవుతాయి. ఇటీవలి కాలంలో ఛార్మి హీరోయిన్ ప్రాధాన్యమున్న చిత్రాలు ఎక్కువగా చేస్తోంది. 'అనుకోకుండా ఒక రోజు', 'మంత్ర', 'మంగళ', 'ప్రేమ ఒక మైకం' ఈ తరహావే. ఆ జాబితాలోకే 'ప్రతిఘటన' కూడా చేరుతుంది.
''నేటి రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ సినిమా ఉంటుంది. కానీ ఎక్కడా వివాదాలకు తావుండదు. పూర్తి స్థాయి వాణిజ్య చిత్రమిది. ఈ కథ వినగానే ఉద్వేగానికి లోనయ్యాను. నా పాత్రను ప్రతి ఒక్కరూ అభినందిస్తారు'' అని ట్విట్టర్ ద్వారా ఈ చిత్రం వివరాలను చార్మి తెలియజేశారు.
మంత్ర, సుందరకాండ, మనోరమ, కావ్యాస్ డైరీ, సై ఆట, మంగళ, నగరం నిద్రపోతున్న వేళ వంటి స్త్రీ ప్రధాన చిత్రాల్లో నటించి నటిగా తన సత్తా ఏంటో ఇప్పటికే చాటారు చార్మి. ఆమె నటించిన మరో లేడీ ఓరియంటెడ్ చిత్రం 'ప్రేమ ఒక మైకం' త్వరలో విడుదల కానుంది. అందులో ఆమె వేశ్య పాత్రతో మెప్పించబోతున్నారు.