లంచ్ బ్రేక్ లో తప్ప ఎందుకూ పనికిరావు : చిరు కూతురు పంచ్ ఎవరికంటే
సుస్మితా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మను టార్గెట్ చేస్తూ ఒక ఇంటర్వ్యూలో కామెంట్స్ చేయడం హాట్ న్యూస్ గా మారింది.
మామూలుగా మెగా డాటర్స్ ఇద్దరూ వివాదాలకూ, వార్తలకూ దూరంగానే ఉంటారు. పేపర్లలో స్టేట్మెంట్లూ, ఇంటర్వ్యూలు అసలుండేవి కావు. అయితే ఈ మధ్య మెగాస్టార్ పెద్దకూతురు సుస్మిత ఫ్యాషన్ డిజైనర్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకోవాలనిప్రయత్నిస్తూ కష్తపడుతోంది. అయితే సుస్మితా ఈ మధ్య ఒక వివాదం లో స్పందించింది.
సుస్మితా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మను టార్గెట్ చేస్తూ ఒక ఇంటర్వ్యూలో కామెంట్స్ చేయడం హాట్ న్యూస్ గా మారింది. వర్మ ట్విట్టర్ ద్వారా చేసే కామెంట్లను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని అంటూ లంచ్ బ్రేక్లో మాట్లాడుకోవడానికి తప్ప ఆ కామెంట్లు ఎందుకూ పనికి రావని అంటూ సెటైర్లు వేసింది సుస్మిత.

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ల విషయం లో మెగా ఫ్యామిలీ గుర్రుగా ఉందన్న సంగతి తెల్సిందే. తమ కుటంబాన్ని టార్గెట్ చేస్తూ రామూ చేసిన ఈ ట్వీట్లపై మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత ఓ ఇంటర్వ్యూలో స్పందించింది వర్మ ట్విట్టర్ ద్వారా చేసే కామెంట్లను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని, లంచ్ బ్రేక్లో మాట్లాడుకోవడానికి తప్ప ఆ కామెంట్లు ఎందుకూ పనికి రావని .,
ఖాళీ సమయంలో వర్మ ట్వీట్లు చూసి నవ్వుకుంటామని , ఒకరు మాట్లాడే మాటలను మనం నియంత్రించలేమని చెప్పిన సుస్మిత. ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఉన్నా.., పూర్తిగా నెగిటివ్గా మాట్లాడే వారిని సామాజిక మాధ్యమాల నుంచి బ్లాక్ చేయాలంటూ అభిప్రాయ పడింది.

ఇదే విషయం పై కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ కూడా ఇదే రకంగా స్పందించిన విషయం తెలిసిందే. . ఓసారి తనను మెచ్చుకోవచ్చు, మరోసారి తిట్టవచ్చునని... కానీ వర్మ ట్వీట్ల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదంటూ. పెళ్లైన కూతురును పెట్టుకొని పోర్న్ వీడియోలు దగ్గర ఉంచుకుంటానని చెప్పిన అతని గురించి ఏం మాట్లాడుతామని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











