Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఏపీ ప్రభుత్వం సినిమా రిస్టార్ట్ ప్యాకేజీ: సీఎం జగన్కు చిరంజీవి కృతజ్ఞతలు
కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచం మొత్తం విలవిల్లాడింది. ఇండియాలో లాక్డౌన్ కారణంగా చాలా పరిశ్రమలు మూతపడిపోయాయి. అందులో సినీ పరిశ్రమ కూడా ఉంది. దాదాపు ఎనిమిది నెలల పాటు షూటింగులు ఆగిపోయాయి. దీంతో చాలా మంది నిర్మాతలు నష్టాలను ఎదుర్కొన్నారు. అదే సమయంలో సినిమా థియేటర్లు కూడా క్లోజ్ అయిపోయాయి. దీని వల్ల సినిమా హాళ్ల యాజమాన్యలకు తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది. దీని వల్ల ప్రభుత్వాల నుంచి పర్మీషన్లు వచ్చినా థియేటర్లను పున: ప్రారంభించలేని పరిస్థితి ఏర్పడింది. కొన్నైతే శాశ్వతంగా మూతపడ్డాయి.
కరోనా కారణంగా నష్టాలను ఎదుర్కొంటోన్న సినీ పరిశ్రమను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. తాజాగా జరిగిన కేబినెట్ మీటింగ్లో ఇండస్ట్రీ కోసం రీస్టార్ట్ ప్యాకేజీని ప్రకటించారు. ఇందులో భాగంగా 3 నెలలపాటు థియేటర్లు చెల్లించాల్సిన ఫిక్స్డ్ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు, దీని ద్వారా నెలకు రూ.3 కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వం భరించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1100 థియేటర్లకు లబ్ధి చేకూరనుంది. అంతేకాదు, థియేటర్ యాజమాన్యాలకు వర్కింగ్ క్యాపిటల్ రుణాలు కూడా ప్రకటించింది.
సినీ పరిశ్రమను ఆదుకునేందుకు ముందుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో 'కరోనా సమయంలో నష్టపోయిన ఎగ్జిబిటర్స్ కోసం సినిమా రిసార్ట్ ప్యాకేజీని ప్రకటించిన ఏపీ సీఎం వైఎస్ జగన్కు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. సినిమా థియేటర్ల పునరుద్దరణ కోసం అనేక చర్యలు చేపట్టాలి. సినిమా పరిశ్రమ మీద వేలాది మంది కుటుంబ సభ్యులు ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. దీని ద్వారా వారికి జీవనోపాధి లభిస్తుంది' అని ఆయన పోస్ట్ చేశారు.