Don't Miss!
- News UN On Arvind Kejriwal: కేజ్రివాల్ అరెస్టుపై స్పందించిన ఐరాస-భారత్ కు కీలక సూచన..!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఉయ్యాలవాడ లాంచ్ అయిపోయింది: ఎవ్వరూ ఊహించని మెగా పంచ్
మెగా స్టార్ చిరంజీవి 'ఖైదీనెం 150 తో తన సత్తా చాటుకున్నారు. ఐతే ఆ సినిమా విడుదలై ఏడు నెలలు దాటుతున్నా చిరు తర్వాతి సినిమా మొదలు కాలేదు.
మెగా స్టార్ చిరంజీవి 'ఖైదీనెం 150 తో తన సత్తా చాటుకున్నారు. ఐతే ఆ సినిమా విడుదలై ఏడు నెలలు దాటుతున్నా చిరు తర్వాతి సినిమా మొదలు కాలేదు. చిరు తర్వాతి సినిమాగా'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' కన్ఫమ్ అయింది కానీ.. ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందన్నది క్లారిటీ లేదు. అనుకుంటూన్న వాళ్ళందరికీ పేద్ద పంచ్ ఇచ్చింది మెగా ఫ్యామిలీ
అభిమానులే నమ్మలేకపోయారు
వేసవికే ప్రారంభోత్సవం అన్నారు కానీ.. అలా జరగలేదు. తర్వాత చిరంజీవి పుట్టిన రోజున కొబ్బరికాయ కొడతారని గట్టి ప్రచారమే జరిగింది. ఇక అంతా ఆరోజు కోసమే ఎదురు చూస్తున్నార్తు. అయితే ఉన్నట్టుండీ ఈ రోజు ఉదయం చడీచప్పుడు లేకుండా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' ముహూర్త కార్యక్రమం పూర్తి చేసేసింది చిత్ర బృందం. అసలూ ఈ విషయం తెలియగానే అభిమానులే నమ్మలేకపోయారు.
Recommended Video
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
కొణిదెల ప్రొడక్షన్స్ ఆఫీస్ లో బుధవారం ఉదయం ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' ప్రారంభోత్సవం చడీచప్పుడు లేకుండా చాలా సింపుల్ గా పూర్తి చేశాడట రామ్ చరణ్. చిరంజీవి.. చరణ్.. సురేందర్ రెడ్డిలతో పాటు అ్లలు అరవింద్.. సురేఖ. పరుచూరి సోదరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
షూటింగ్ ఎప్పుడన్నది ప్రకటించలేదు
రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడన్నది ఇంకా ప్రకటించలేదు. మామూలుగా ముహూర్త కార్యక్రమంలో స్క్రిప్టు చేతికిచ్చేటపుడు ఒక ఫైల్ కనిపిస్తుంది. కానీ ‘ఉయ్యాలవాడ..' ప్రారంభోత్సవం సందర్భంగా మూడు పెద్ద ఫైల్స్ కనిపించడం విశేషం. దీన్ని బట్టి ఇది పెద్ద సినిమా కావచ్చని.. డైలాగులు భారీ స్థాయిలో ఉండొచ్చని భావిస్తున్నారు.
సాయిమాధవ్ బుర్రా
పరుచూరి సోదరులతో పాటు సాయిమాధవ్ బుర్రా.. వేమారెడ్డి.. ఇంకో ఇద్దరు రచయితలు కలిపి వండిన స్క్రిప్టు ఇది. ఈ చిత్రానికి సంగీతాన్నందించేందుకు ఎ.ఆర్.రెహమాన్ తో సంప్రదింపులు జరుపుతున్నారట. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ.. తమిళ భాషల్లోనూ రిలీజ్ చేయబోతున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో పేరున్న టెక్నీషియన్లనే తీసుకుంటున్నారు. ఈ సినిమాకు ఛాయాగ్రాహకుడిగా రవి వర్మన్ ను ఎంచుకున్న సంగతి తెలిసిందే.