టచ్ చేసి చూడుకు దంగల్ ఫేం ప్రీతం మ్యూజిక్
మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం టచ్ చేసి చూడు చిత్రానికి దంగల్ ఫేం ప్రీతం చక్రవర్తి సంగీతాన్ని అందిస్తున్నారు.
మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం టచ్ చేసి చూడు చిత్రానికి దంగల్ ఫేం ప్రీతం చక్రవర్తి సంగీతాన్ని అందిస్తున్నారు. బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమీర్ఖాన్ నటించిన సంచలన చిత్రం 'దంగల్'కు ప్రీతం చక్రవర్తి సంగీతాన్ని అందించిన సంగతి తెలిసిందే.

దంగల్ చిత్రం కథాపరంగానే కాకుండా సంగీతపరంగా కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నది. దంగల్ చిత్రానికి అందించిన సంగీతానికి ప్రీతంకు ఫిలింఫేర్ అవార్డును కూడా సంపాదించిపెట్టింది.
ఈ నేపథ్యంలో బాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ ఉన్న సంగీత దర్శకుడు ప్రీతం తెలుగు చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారనే వార్త ఆసక్తిని రేపుతున్నది. అయితే పవర్, బలుపు చిత్రాలకు మ్యూజిక్తో మ్యాజిక్ చేసిన ఎస్ఎస్ థమన్కు హ్యాండివ్వడం ఫిలింనగర్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











