Don't Miss!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- News ఇంటర్ కళాశాలకు వేసవి సెలవులు...ఎప్పటినుంచంటే..?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
క్రెడిట్ మాదే అంటూ... దాసరి-చిరు వర్గాల సిగపట్లు!
తాజాగా ఈ రెండు వర్గాల మధ్య మరో వివాదం చెలరేగింది. ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమపై విధించిన VAT(విలువ ఆధారిత పన్ను) ను ఎత్తి వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. చిరంజీవి కేంద్ర మంత్రి అయిన తర్వాత ఈ విషయంలో ఎక్కువ చొరవ తీసుకుని ముఖ్యమంత్రితో మాట్లాడటం వల్లనే వ్యాట్ రద్దు చేసారని చిరంజీవి వర్గం ప్రచారం చేసింది. అంతటి ఆగకుండా ఆయన వర్గానికి చెందిన కొందరు చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయనకు కృతజ్ఞతలు తెలిపి ఈ క్రెడిట్ అంతా ఆయనకే దక్కేలా పక్కా వ్యూహం రచించారు.
దీంతో చిర్రెత్తిన దాసరి నారాయణరావు వర్గం....ఇందులో చిరంజీవి చేసిందేమీ లేదని, దాసరి నారాయణరావు వల్లనే పరిశ్రమకు ఈ మేలు జరిగిందని, ముఖ్యమంత్రి కిరణ్తో మాట్లాడి ఈ మ్యాటర్ సెటిల్ చేసారని పుంగి భజాయిస్తూ రంగంలోకి దిగారు. దాసరి నారాయణరావు శిష్యుడు నట్టి కుమార్ మీడియాతో మాట్లాడుతూ....నిర్మాతల మండలితో కలిసి దాసరి నారాయణరావు VAT ఎత్తివేయించడంలో కృషి చేసారని, ఇందులో చిరంజీవి చేసిందేమీ లేదని చెప్పుకొచ్చారు. నట్టితో పాటు జీవిత రాజశేఖర్, మోహన్ గౌడ్ కూడా మీడియా సమావేశంలో పాల్గొని దాసరి నారాయణరావుదే ఈ క్రెడిట్ అంటూ నొక్కి వక్కానించారు. మరి ఈ VAT క్రెడిట్ వివాదం ఎంత వరకు వెలుతుందో.....నిజంగా ఈ క్రెడిట్ ఎవరిదో తేలాల్సి ఉంది.