Don't Miss!
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- News చంద్రబాబు బచ్చా కామెంట్ కు జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇలా...!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
వివాదం: దేవిశ్రీ ప్రసాద్ వల్ల మనోళ్లు నష్టపోతున్నారా?!
హైదరాబాద్: టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరోల సినిమాలకు సూపర్ హిట్ మ్యూజిక్ అందిస్తూ ఫాంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే దేవిశ్రీ ప్రసాద్ వ్యవహారం ఇపుడు వివాదంగా మారింది. ఆంధ్రప్రదేశ్ సినీ మ్యూజీషియన్స్ యూనియన్లో మెంబర్ షిప్ తీసుకోవడానికి దేవిశ్రీ ప్రసాద్ నిరాకరించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతో యూనియన్ అతనిపై చర్య తీసుకునే యోచనలో ఉంది.
దేవిశ్రీతో పాటు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లయిన తమన్, కోటి, కీరవాణి కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారని, యూనియన్ జనరల్ బాడీ మీటింగులో వీరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 2వ ఆదివారం ఈ మీటింగ్ జరిగే అవకాశం ఉంది. మొత్తానికి ఈ వివాదం సినీ పరిశ్రమలో చర్చనీయాంశం అయింది.
వీరు తెలుగు సినిమాలకు పని చేస్తూ....తమిళనాడులో తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని, దీని వల్ల ఇక్కడి వారు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. వారు ఒకసారి ఏపీ యూనియన్లో మెంబర్ షిప్ తీసుకుంటే....రికార్డింగ్స్ హైదరాబాద్లోనే చేయాల్సి ఉంటుంది. ఇతర విషయాల్లో కూడా ఏపీ మ్యూజీషియన్స్ యూనియన్లో సభ్యత్వం ఉండే వారి సేవలు మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.
ఈ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు తెలుగుతో పాటు ఇతర బాషా చిత్రాలకు కూడా సంగీతం అందిస్తున్నారు. ఏపీ యూనియన్లో సభ్యత్వం తీసుకుంటే అక్కడ ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందనే సందేహంలో పడ్డారు. ఈ కారణంగానే వారు సభ్యత్వం తీసుకోవడానికి నిరాకరిస్తున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా......యూనియన్ మెంబర్ షిప్ తీసుకుంటే తెలుగు వారికి ఎంతో కొంత మేలు జరుగుతుందనేది సత్యం. యూనియన్ వారు చేస్తున్న వాదనలోనూ న్యాయం ఉంది.