కోర్టు మెట్లెక్కిన ధనుష్!
తనపై దాఖలైన పిటిషన్ పై స్టే విధించాలంటూ తమిళ నటుడు, రజనీకాంత్ అల్లుడు ధనుష్ మద్రాస్ కోర్టును ఆశ్రయించాడు.
తనపై దాఖలైన పిటిషన్ పై స్టే విధించాలంటూ తమిళ నటుడు, రజనీకాంత్ అల్లుడు ధనుష్ మద్రాస్ కోర్టును ఆశ్రయించాడు. తనపై దాఖలైన పిటిషన్ కొట్టివేయాలని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. ధనుష్ దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ జీ చోకలింగం విచారించారు.
అనంతరం పిటిషన్ దారులు కాథిరేశన్, మీనాక్షి దంపతులను కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. అనంతరం ఈ కేసు విచారణను ఫిబ్రవరి 8 తేదీకి వాయిదా వేశారు.

ఇటీవల ఓ దంపతులు ధనుష్ తమ కుమారుడని తమిళనాడులోని మేలూర్ కు సమీపంలోని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. చిన్నతనంలో సినిమాలపై మోజుతో చెన్నైకి పారిపోయాడని వారు ఫిర్యాదులో తెలిపారు. అంతేకాకుండా తమ సంతానంలో మూడో కుమారుడైన ధనుష్ జీవన భృతి కింద నెలకు రూ.65 వేలు చెల్లించాలని పిటిషన్ లో పేర్కొన్నారు.
More from Filmibeat
dhanush madras high court rajnikanth tamil film industry ధనుష్ మద్రాస్ హైకోర్టు రజనీకాంత్ తమిళ చిత్ర పరిశ్రమ


Click it and Unblock the Notifications











