Don't Miss!
- News కోర్టు తీర్పుతో ఎన్నికల అస్త్రాన్ని కోల్పోయిన వైఎస్ షర్మిల, సునీత.. వాట్ నెక్స్ట్!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Sports IPL: ఆ కుర్రాడిపై అంబానీ కన్ను!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
'గృహహింస'కేసుపై కోర్టుకి అక్షయ్కుమార్
దీనిపై బాంబే హైకోర్టులో కపాడియా పిటిషన్ దాఖలు చేస్తూ తాను చట్టపరంగా ఖన్నాను వివాహం చేసుకున్న భార్యనని.. తన భర్త వదలిపెట్టి వెళ్లిన ఆస్తిలో ఏ మహిళా వాటా కావాలని కోరజాలదని వాదించారు. అదీగాకుండా అనితా అద్వానీ ఫిర్యాదు మేరకు బాంద్రా మేజిస్ట్రేట్ తనకు, తన కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేయడాన్ని పిటిషన్లో సవాల్ చేశారు. రాజేష్ ఖన్నాకు చెందిన సుమారు రూ.500 కోట్ల విలువైన ఆస్తిలో వాటా అడిగే హక్కు అనితా అద్వానీకి లేదని కపాడియా వాదనను బలపరుస్తూ ఆమె అల్లుడు, నటుడు అక్షయ్కుమార్ కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారం హైకోర్టులో తేలేవరకు బాంద్రా మేజిస్ట్రేట్ ఎదుట విచారణ నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈకేసుపై జస్టిస్ కె.యు.చాందివల్ సోమవారం విచారణ జరపనున్నారు.
రాజేష్ ఖన్నా మరణం తర్వాత.....రాజేష్ ఖన్నా ఫ్యామిలికీ, రాజేష్ ఖన్నా ప్రియురాలి(డేటింగ్ పార్టనర్) అనితా అద్వానీ మధ్య ప్రాపర్టీ గొడవలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రాజేష్ ఖన్నా భార్య డింపుల్ కపాడియా, అల్లుడు అక్షయ్ కుమార్, కుతుర్లు ట్వింకిల్ ఖన్నా, రింకీ ఖన్నాలపై గృహ హింస చట్టం కింద కేసు వేసింది. బాంద్రాలోని రాజేష్ ఖన్నాకు చెందిన బంగ్లా 'ఆశీర్వాద్' విషయంలోనే ఈ రెండు వర్గాల మధ్య వివాదం నెలకొంది.దాదాపు 8 ఏళ్లుగా రాజేష్ ఖన్నాతో అనితా అద్వానీ ఆశీర్వాద్ బంగ్లాలో సహజీవనం చేస్తోంది. రాజేష్ ఖన్నా మరణం అనంతరం అనితా అద్వానీని బయటకు పంపి ఆ బంగ్లాను స్వాధీనం చేసుకోవడానికి ఖన్నా ఫ్యామిలీ ప్రయత్నిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
తాను పిలిప్పైన్స్ మాజీ అధ్యక్షుడి కుటుంబానికి చెందినదాన్నని, బాలీవుడ్లో నిర్మాతగా అడుగు పెట్టడానికి ప్రయత్నించానని అద్వానీ గతంలో చెప్పారు. తనకు ఇప్పుడు 50 ఏళ్లని, తనకు మరొకరి సహాయం అవసరమైన సమయంలో తనను ఇంటి నుంచి బయటకు పంపించేశారని ఆమె ఆరోపించారు.బాంద్రాలోని కార్టర్ రోడ్డులో ఇంటి నుంచి తనను బయటకు గెంటేశారని ఆరోపిస్తూ అనితా అద్వానీ గృహ హింస నిరోధక చట్టం కింద తన హక్కును డిమాండ్ చేశారు. రాజేష్ ఖన్నా అంత్యక్రియల సందర్భంగా కుటుంబ సభ్యుల తీరు తనను ఇబ్బంది పెట్టేలా ఉందని ఆమె ఆరోపించారు.