Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్ బాబుతో మరో సినిమాపై క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్.. స్టోరీ రెడీ, ఆయన ఎప్పుడంటే అప్పుడే!
సూపర్ స్టార్ మహేష్ బాబు డేట్స్ కోసం అగ్ర దర్శకులు చాలామంది ఎదురుచూస్తున్నారు. మహేష్ కూడా ఏడాదికి రెండు సినిమాలను చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు గాని ఏ ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వడం లేదు. కరోనా లాక్ డౌన్ అనంతరం ఇచ్చిన కమిట్మెంట్స్ కు తగ్గట్లుగా సినిమాలు రిలీజ్ అవుతాయో లేదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇక ఇటీవల మహేష్ బాబు మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు క్లారిటీ వచ్చేసింది.
అర్ధరాత్రి షూటింగ్స్ లో మహేష్
గీతాగోవిందం దర్శకుడు పరశురామ్ తో మహేష్ 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ మొదటి సారి మహేష్ బాబుకు జోడిగా నటిస్తోంది. ఇక అర్జున్ లాంటి సీనియర్ యాక్టర్ కూడా కీలకపాత్రలో కనిపించనున్నారు. సినిమా షూటింగ్ స్పీడ్ కూడా పెరిగింది. మహేష్ బాబు అర్ధరాత్రి షూటింగ్స్ లో కూడా పాల్గొంటున్నాడు.
జెట్ స్పీడ్ మరో సినిమా
సర్కారు వారి పాట, త్రివిక్రమ్ ప్రాజెక్టుల అనంతరం మహేష్ బాబు ఎవరితో సినిమా చేస్తాడు అనేది కాస్త హాట్ టాపిక్ గా మారింది. ప్లాన్ ప్రకారం RRR ప్రాజెక్ట్ అనంతరం రాజమౌళితో ఒక సినిమాను ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాకు ఇంకాస్త టైమ్ పట్టవచ్చు కాబట్టి.. మధ్యలో జెట్ స్పీడ్ లో మరేదైనా సినిమాను పూర్తి చేయాలని మహేష్ ఆలోచిస్తున్నాడు.
అనిల్ రావిపూడితో..
అసలైతే సరిలేరు నీకెవ్వరు సినిమా అనంతరం వంశీ పైడిపల్లితో ఒక సినిమా చేయాలని అనుకున్న మహేష్ ఆ తరువాత వెంటనే అనిల్ రావిపూడితో మరో సినిమా చేయాలని అనుకున్నాడు. స్టోరీ లైన్ ముందే సెట్ చేసుకున్న అనిల్ రావిపూడి ఫుల్ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసి ఉంచాడు. కానీ ఎందుకో ప్లాన్స్ మొత్తం తారుమారయ్యాయి. మహేష్ సడన్ గా పరశురామ్ ను లైన్ లో పెట్టి సర్కారు వారి పాటను సెట్స్ పైకి తెచ్చాడు.
మహేష్ ఒప్పుకుంటే..
ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి క్లారిటీ ఇచ్చేశాడు. మహేష్ బాబుకు ఫుల్ స్క్రిప్ట్ వినిపించి ఓకే చేయించినట్లు వివరణ ఇచ్చాడు. అయితే మహేష్ ఎప్పుడు ఒప్పుకుంటే సినిమా అప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పాడు. ప్రస్తుతం అనిల్ F3 సినిమాకు ఫీనిషింగ్ టచ్ ఇస్తున్న విషయం తెలిసిందే.
ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఇస్తే..
సర్కారు వారి పాట అనంతరం మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలుస్తాడాని క్లారిటీ అయితే వచ్చింది. ఇక రాజమౌళి సినిమా అంటే వచ్చే ఏడాది ఉంటుంది. దీన్ని బట్టి అనిల్ రావిపూడి ఈ మధ్యలో సెట్టవ్వడం కష్టమే అని చెప్పవచ్చు. ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్రివిక్రమ్ సినిమాతో పాటు ఒకేసారి ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆ లోపు అనిల్ మరొక హీరోతో సినిమా మొదలు పెట్టవచ్చని టాక్ వస్తోంది. ఏదేమైనా ఈ లైనప్ క్లారిటీ రావాలి అంటే కరోనా కాలమే సమాధానం చెప్పాలి.