దర్శకుడు రాఘవేంద్రరావుకు జరిమానా

ఇంతకు ముందు హీరో సునీల్ కారుకు కూడా బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో పోలీసులు రూ.100 జరిమానా విధించారు. అయితే అప్పుడు తొలి రోజు కావును రూ.100 జరిమానా విధుస్తున్నామని, రేపటి నుంచి కార్ల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉంటే రూ.500 జరిమానా విధిస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటికీ వంద రూపాయలు మాత్రమే జరిమానా విధిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు నాలుగు చక్రాల వాహనదారులపై ఒక్కసారిగా కొరడా ఝళిపించారు. కార్ల అద్దాలకు నల్ల రంగు ఫిల్ములను అమర్చడాన్ని సుప్రీం కోర్టు నేరంగా పరిగణించడంతో ట్రాఫిక్ పోలీసులు గురువారం నుంచీ హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇటువంటి కార్లకు జరిమానాలు విధించడం ప్రారంభించారు.
దుండగులు వాహనాలకు నల్లటి ఫిల్ములు కలిగిన అద్దాలను ఉపయోగించి తద్వారా అత్యాచారాలు, అపహరణలు మొదలైన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో, వీటిని అదుపు చేసేందుకు గానూ వాహనాలకు నల్లటి ఫిల్ముల ఉపయోన్ని సుప్రీం కోర్టు నిషేధించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేసి, వాహనాల అద్దాలకు పరిమితులకు మించి టింట్ చేయబడి ఉన్నట్లయితే జరిమానా విధంచడమే కాకుండా ఆన్-ది-స్పాట్లోనే సన్ఫిల్మ్లను తొలగించడం జరుగుతుంది.
"మోటార్ వాహన చట్టం ప్రకారం, కారు విండ్స్క్రీన్స్ (ముందు వైపు అద్దం), రియర్ విండో (వెనుక వైపు అద్దం) లపై 70 శాతం విజువల్ లైట్ ట్రాన్స్మిషన్ (విఎల్టి)ను, కారుకు పక్కల ఉండే అద్దాలకు (కారు డోర్లకు అమర్చిన అద్దాలు) 50 విఎల్టిని కలిగి ఉండాలి". సాధారణంగా వాహనాలను తయారు చేసే కంపెనీలు ఈ నియమాన్ని దృష్టిలో ఉంచుకొనే అద్దాలను ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి, ఫ్యాక్టరీ ఫిట్టెడ్ గ్లాసెస్లపై ఏ రకమైన సన్ ఫిల్ములను ఉపయోగించిన అది చట్ట వ్యతిరేకమే అవుతుంది.


Click it and Unblock the Notifications











