Don't Miss!
- Finance
Gold Price Today: జీవితకాల గరిష్ఠానికి బంగారం.. బడ్జెట్ పరుగులు.. కొనాలా..? మానాలా..?
- Lifestyle
Sickle Cell Anemia: సికిల్ సెల్ అనీమియా అంటే ఏంటి? లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకోండి
- Technology
కొత్త బడ్జెట్ లో PAN కార్డు పై కొత్త రూల్స్! ఇకపై అన్ని డిజిటల్ KYC లకు PAN కార్డు చాలు!
- News
Union Budget 2023: మహిళలకు కొత్త స్కీమ్.. సీనియర్ సిటిజన్లకు, గృహ కొనుగోలుదారులకు శుభవార్త!!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Sports
వికెట్ తీసిన తర్వాత అతి చేష్టలు.. స్టార్ ఆల్రౌండర్పై అంపైర్ గుస్సా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఒకేరోజు ఇద్దరు టాప్ డైరెక్టర్లకు యాక్సిడెంట్.. ఒకరు ఆస్పత్రి బెడ్ పై, మరొకరు గాయంతో సెట్ లో!
మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాలను అందించిన దర్శకులలో సురేందర్ రెడ్డి ఒకరు. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరుగా.. స్టైలిష్ డైరెక్టర్ గా సూపర్ పాపులర్ అయ్యారు. నందమూరి కల్యాణ్ రామ్ నటించిన అతనొక్కడే సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన సురేందర్ రెడ్డి తర్వాత రవితేజతో ప్రేక్షకులకు సూపర్ 'కిక్' ఇచ్చారు. ఇప్పుడు అఖిల్ అక్కినేనితో ఏజెంట్ తెరకెక్కిస్తున్న ఆయనకు ప్రమాదం జరిగింది. అలాగే బాలీవుడ్ చిత్రసీమలో యాక్షన్ చిత్రాలకు, కామెడీ సినిమాలకు పెట్టింది పేరైన మరో డైరెక్టర్ రోహిత్ శెట్టి కూడా ప్రమాదానికి గురయ్యాడు. ఆ వివరాల్లోకి వెళితే..

రవితేజ కిక్ సినిమాతో..
తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు సురేందర్ రెడ్డి. 2005లో నందమూరి కల్యాణ్ రామ్ అతనొక్కడే సినిమాతో దర్శకుడిగా తెలుగు సినిమా ప్రేక్షకులను పరిచయం అయిన సురేందర్ రెడ్డి యాక్షన్ మూవీస్ కు పెట్టింది పేరుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అతనొక్కడే తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అశోక్, సూపర్ స్టార్ మహేశ్ బాబుతో అతిథి ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీస్ తెరకెక్కించిన ఆయన మాస్ మహారాజ రవితేజ కిక్ రూపొందించి సరికొత్త కామెడీ అందించారు. 2009లో వచ్చిన కిక్ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
After an On Set Accident this morning, Our Director DirSurender gets back from the hospital & continues the #Agent shoot🔥
— AK Entertainments (AKentsOfficial) January 7, 2023
Bowing down to his dedication to delivering a solid film to you all ❤️✌️#AgentLoading - SUMMER 2023😎AkhilAkkineni8 mammukka AnilSunkara1 s2c_offl pic.twitter.com/6BD8TlKgP6
కాలికి గాయమైనప్పటికీ..
కిక్ తర్వాత ఊసరవెల్లి, రేసు గుర్రం, కిక్ 2, ధ్రువ, సైరా నరసింహా రెడ్డి వంటి చిత్రాలను తెరకెక్కించారు. ఇప్పుడు అక్కినేని అఖిల్ తో ఏజెంట్ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా కూడా ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ అని ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం సురేందర్ రెడ్డి చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే యాక్షన్స్ వివరించే క్రమంలో సురేందర్ రెడ్డి గాయపడ్డారట. ఆయన కాలికి తీవ్ర గాయమైనప్పటికీ మళ్లీ వచ్చి షూటింగ్ లో పాల్గొన్నారని మేకర్స్ చెప్పారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
|
ఆయన చూపే శ్రద్ధకు..
"ఉదయం సెట్ లో ప్రమాదంలో గాయపడిన మా డైరెక్టర్ సురేందర్ ఆస్పత్రి నుంచి తిరిగి వచ్చి మరి ఏజెంట్ సినిమా షూటంగ్ లో పాల్గొన్నారు. ఒక మంచి సినిమాను అందించేందుకు ఆయన చూపే శ్రద్ధకు మంత్రముగ్ధుడిని అయ్యాను" అని మేకర్స్ రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే సురేందర్ రెడ్డిలానే మరో టాప్ డైరెక్టర్ గాయపడ్డారు. యాక్షన్ అండ్ కామెడీ చిత్రాలకు పేరుగాంచిన ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి గాయాలపాలయ్యారు.

హైదరాబాద్ లో ప్రమాదం..
హైదరాబాద్ శివారులోని రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు రోహిత్ శెట్టి. ఈ సినిమాలో భాగంగా కారు చేజింగ్ సీన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు గాయపడ్డారు దర్శకుడు రోహిత్ శెట్టి. దీంతో ఆయన్ను హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. అయితే రోహిత్ శెట్టి.. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రతో కలిసి ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనే సిరీస్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ కు సంబంధించిన ఒక షెడ్యూల్ ను హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన గాయపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

రీమెక్స్ చిత్రాలతో..
ఇక డైరెక్టర్ రోహిత్ శెట్టికి సౌత్ లో కూడా ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే ఆయన హిందీలో చిత్రాలు తెరకెక్కించినప్పటికి అందులో సౌత్ ఫ్లేవర్ కనిపిస్తుంది. అంతేకాకుండా ఆయన ఎక్కువగా.. తెలుగు, తమిళ హిట్ సినిమాలను రీమెక్స్ చేస్తుంటారు. ఆయన తీసిన సినిమాల్లో సింగం, సింగం 2, సింబా, చెన్నై ఎక్స్ ప్రెస్, సూర్య వంశీ, గోల్ మాల్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. అయితే ఇటీవల రణ్ వీర్ సింగ్, పూజా హెగ్డేలతో తీసిన సర్కస్ మూవీ మాత్రం డిజాస్టర్ టాక్ అందుకుంది.