Don't Miss!
- News గజలక్ష్మీ యోగం.. నేటినుండి ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాలు 50 ఏళ్ల నుంచి పాడుతున్నారు.. చట్టాలు తెలియవా? ఇళయరాజా విచిత్రం..
సంగీత దిగ్గజాలు ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రమణ్యం మధ్య చోటుచేసుకొన్న లీగల్ నోటీసుల వివాదంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది.
సంగీత దిగ్గజాలు ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రమణ్యం మధ్య చోటుచేసుకొన్న లీగల్ నోటీసుల వివాదంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది. నేను స్వరపరచిన గీతాలు పాడటం సరికాదు. వేదికల మీద నా పాటలు పడేందుకు తప్పనిసరిగా నా అనుమతి ఉండాల్సిందే అని బాలుకు ఇళయరాజా నోటీసులు పంపడం ప్రస్తుతం మ్యూజిక్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
రాయల్టీ కోరే హక్కు ఉంటుంది
‘సింగర్స్, రైటర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్కుత తమ పాటలకు సంబంధించి రాయల్టీ కోరే హక్కు ఉంటుంది. వ్యాపార, లాభాపేక్షతో సంగీత విభావరి నిర్వాహకులు రాయల్టీ చెల్లించాలి. ఇందుకోసం 1969లో ది ఇండియన్ పెర్ఫార్మెన్స్ రైట్స్ సొసైటీ (ఐపీఆర్ఎస్) ఏర్పడింది.
రాయల్టీ చెల్లించాలి
ఐపీఆర్ఎస్ ఓ ప్రైవేటు రిజిస్టర్డ్ సంస్థ. దీని నిబంధనల ప్రకారం టికెట్ వసూలు చేస్తూ సంగీత విభావరి నిర్వహిస్తే రాయల్టీ చెల్లించాలి. ఎవరి నుంచైనా అభ్యంతరం వ్యక్తమయితే వారి పాటలు పాడకూడదు అనే నిబంధనలు పొందుపరిచారు. గతంలో ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్లలో ప్రోగ్రామ్స్కు రాయల్టీలు ఇచ్చేవారు.
ప్రముఖుల అభిప్రాయాలు
గతంలో లతామంగేష్కర్ తన పాటలకు రాయల్టీ కోరారు అనే విషయాన్ని కొందరు సంగీత ప్రముఖులు గుర్తు చేస్తున్నారు. ఈ వివాదంపై ఐపీఆర్ఎస్ స్పందించాల్సి ఉంది. దీనిపై సునీత, రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరాం లాంటి సంగీత ప్రముఖులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
చట్టం ప్రకారం వాటాలు..
ఐపీఆర్ఎస్
గురించి
గీత
రచయిత
అనంతశ్రీరామ్
చక్కగా
వివరించారు.
రాయల్టీ
వివరాలను
లెక్కలతో
సహా
చెప్పారు.
కాపీరైట్
యాక్ట్
2012
ప్రకారం
ఒకపాట
రాయల్టీలో
50
శాతం
నిర్మాతకి,
25
శాతం
పాట
రచయితకి,
25
శాతం
స్వరకర్తకి
దక్కాలి.
న్యాయపరంగా
రాయల్టీ
ఇవ్వాల్సిందే
అని
ఆయన
వివరించారు.
ఇళయరాజాకు అధికారం ఉంది
చట్టప్రకారం ఇళయరాజాకు నోటీసు ఇచ్చే అధికారం ఉంది. కానీ బాలు యూఎస్లో పాడే సమయంలోనే ఎందుకు ఇచ్చారో? అర్థంకావడం లేదు. 50 ఏళ్లకుపైగా పాటలు పాడుతున్న బాలసుబ్రహ్మణ్యానికి ఐపీఆర్ఎస్ గురించి తెలీదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తప్పుపట్టలేం
చట్టపరంగా బాలుకు ఇళయరాజా నోటీసులు ఇవ్వడంపై తప్పుపట్టలేం. కానీ ఆయన చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇవ్వడమే విచిత్రమని పేర్కొన్నారు. వారిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటే సమస్య సమసిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి.