Don't Miss!
- News కావ్య మారన్ ఆస్తులు ఎంతో తెలుసా - ఒక్కరే వారసురాలు..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘దూసుకెళ్తా’ ఆడియో విడుదల తేదీ, వేదిక
హైదరాబాద్ : మంచు విష్ణు హీరోగా బిందాస్, రగడ చిత్రాల దర్శకుడు వీరుపోట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'దూసుకెళ్తా'. లావణ్య త్రిపాఠి హీరోయిన్. ఆరియానా, వివియానా సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్పై మోహన్బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ చిత్రం ఆడియో ను టైమ్స్ మ్యూజిక్ ద్వారా విడుదల చేయనున్నారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ ఆడియో సెప్టెంబర్ 28న విడుదల కానుంది. హైదరాబాద్ లోని హోటల్ హయిత్ లో ఈ ఫంక్షన్ ని జరపనున్నారు.
విష్ణు మాట్లాడుతూ ''కథకు అతికినట్లు సరిపోయే పేరు అదే. వినోదం, యాక్షన్ అంశాలు సమపాళ్లలో మేళవించి ఉంటాయి. నిదానమే ప్రధానం.. అనే మాట అస్సలు పట్టించుకోడు. వేగం కూడా విస్తుపోయేలా దూసుకెళ్తేనే విజయం.. అనేది అతను నమ్మే సిద్ధాంతం. ఆ ప్రయాణంలో అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే ''అన్నారు.
కెరీర్ ఇక అయిపోయినట్లే అని అనుకుంటున్న తరుణంలో 'దేనికైనా రెడీ' చిత్రంతో హిట్ కొట్టిన విష్ణు తన రాబోయే సినిమాలపై చాలా కాన్ఫిడెంటుగా ఉన్నాడు. 'దూసుకెళ్తా' చిత్రంతో పాటు విష్ణు...తన తండ్రి మోహన్ బాబు, తమ్ముడు మనోజ్లతో కలిసి మల్టీ స్టారర్ చిత్రంలో కూడా నటిస్తున్నారు.
ఈ చిత్రం టైటిల్ కి తగినట్లే విజయం వైపు దూసుకు వెళ్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు దర్శక, నిర్మాతలు. 'దేనికైనా రెడీ' తర్వాత వినోదాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రమిదని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సర్వేష్ మురారి, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేస్.