కళాభవన్ మణి మృతికి కారణం డ్రగ్స్, అక్రమ సంభంధం? ఇన్విస్టిగేషన్ డిటేల్స్
కొచ్చి: కళాభవన్ మణి ఈ మధ్యనే (మార్చి 6, 2016) అనుమానస్పద పరిస్దితుల్లో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన కాలేయ సంభంధ వ్యాధికి ట్రీట్ మెంట్ తీసుకుంటూ మృతి చెందారన్న వార్తలు వచ్చాయి. అయితే ఇది కేరళ పోలీసులు ఈ మృతిని అసహజ మరణం గా కేసు నమోదు చేసారు.
మణి శరీరంలో మిధైల్ ఆల్కహాల్ ఉండటం గమనించంలో ఇలా కేసుని రిజిస్టర్ చేసామని చెప్పారు. ఈ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు సందేహాలు వ్యక్తం చేసారు.
పోలీసులు ఇన్విస్టిగేషన్ చేస్తున్న నేపధ్యంలో కొన్ని డార్క్ సీక్రెట్స్, చీకటి కోణాలు వెలుగులోకి వస్తూ అందరినీ షాక్ కు గురి చేస్తున్నాయి. ఆయన డైరక్ట్ గా డ్రగ్స్ తీసుకోవటమో లేక పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటమో చేసారని అక్కడ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇన్విస్టిగేషన్ లో బయిటపడ్డ విశేషాలు స్లైడ్ షోలో...

అక్రమ సంభందం
అలాగే మణికి అత్యంత సన్నిహితుడైన ఓ వ్యక్తి చెప్పిన దాని ప్రకారం.. ఇడుక్కి కు చెందిన ఓ లేడీ డాక్టర్ తో మణికు అక్రమ సంభంధం ఉంది.

పేరు వద్దు..
అయితే ఆ లేడీ డాక్టర్ పేరు చెప్పటానికి ఇష్టపడలేదు.

అందుకేనేమో
ఇదే మణి కు కుటుంబం తో సరైన సంభంధాలు లేకపోవటానికి కారణం అయ్యిండవచ్చు అంటున్నారు.

ఇంటరాగేట్
ఈ విషయాలు వెలుగులోకి వచ్చాక కళాభవన్ మణి కి చెందిన బంధువులు, స్నేహితులు, ఆయన భార్య నిమ్మి ని ఇంటరాగేట్ చేస్తున్నారు.

డైవర్స్
అందుతున్న సమాచారం ప్రకారం మణి...తన బార్య నిమ్మితో డైవర్స్ తీసుకోవాలని అనుకున్నారు.

డిప్రెషన్
ఇక కళాభవన్ స్నేహితులు తెలియచేసిన దాని ప్రకారం..మణి..లివర్ డిసీజ్ విషయం తెలిసాక చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు

ఫీల్డ్ ని వదిలేయాలనుకున్నాడు
అనారోగ్యం...మణి సినీ కెరీర్ పై పడిందని, త్వరలోనే సినిమాలను వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు.

మేకప్ మ్యాన్ ఏమంటున్నాడంటే
మణి పర్శనల్ మేకప్ మ్యాన్ జయరామ్ ఏమంటున్నాడంటే...మణి చాలా స్ట్రాంగ్ గా ఉండే వ్యక్తి, సూసైడ్ చేసుకునేటంత బలహీన మనస్కుడు కాదు.

ప్రాణం
అంతేకాదు మణికు తన భార్య నిమ్మి అన్నా, కూతురు అన్నా ప్రాణం అని మేకప్ మ్యాన్ చెప్పాడు

తెలియదా
మరో ప్రక్క మణి భార్యకు ..లివర్ డ్యామేజ్ విషయం తెలియదు అని చెప్తున్నారు. ఆవిడ మణి ని వదిలేసి వెళ్లిపోయింది. వెనక్కితిరిగిరాలేదు.

పోస్ట్ మార్టం రిపోర్ట్ లో
ఆయన శరీరంలో విషపూరితమైన క్రిమి సంహారక మందులున్నట్టు పోస్ట్మార్టమ్ నివేదికలో తేలడంతో ఆయనది సహజ మరణం కాదనే అనుమానాలు తలెత్తున్నాయి.

డాక్టర్స్
మణి విసేరాలను కోచిలోని రీజినల్ కెమికల్ ఎగ్జామినర్ లాబోరేటరీకు పంపగా, వాటికి సంబంధించిన నివేదికను వైద్యులు విడుదల చేశారు.

మణి శరీరంలో
ఆయన నమూనాలలో క్లోర్ఫైరిఫోస్, మిథైల్, ఎథైల్ ఆల్కాహాల్ లాంటి అత్యంత ప్రమాదకరమైన క్రిమిసంహారక మందులు లభ్యమయ్యాయని వైద్య నిపుణుడు కే మురళీధరన్ నాయర్ పీటీఐకి వెల్లడించారు.

రక్తం వాంతి
కళా భవన్ మణి తీవ్రమైన లివర్ సమస్యతో బాధపడ్డారు. ఆయన లివర్ పూర్తిగా డామేజ్ అయింది. లిక్కర్ తీసుకున్న తర్వాత లివర్ ఫంక్షన్ కు ఇబ్బంది ఎదురై రక్తం వాంతి చేసుకున్నారు. టాక్సికాలజీ రిపోర్టు తర్వాత విషం ప్రయోగం జరిగినట్లు తేలడంతో అందరూ షాకయ్యారు.

కోరితే..
ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు కోరితే వాస్తవాలను బయటపెట్టేందుకు అత్యున్నతస్థాయిలో సమగ్ర దర్యాప్తును చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ తెలిపారు.


Click it and Unblock the Notifications











