Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బాలకృష్ణ 'శ్రీరామ రాజ్యం' పాటల విశేషాలు
బాపు దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'శ్రీరామరాజ్యం'. నందమూరి బాలకృష్ణ శ్రీరామునిగా, సీతాదేవిగా నయనతార నటించిన చిత్రం పాటలను ఈ నెల 15న భద్రాచలంలో విడుదల చేయనున్నారు. ఈ సెందర్బంగా నిర్మాత యలమంచిలి సాయిబాబు విశేషాల్ని వెల్లడిస్తూ ఇళయరాజా స్వరపరచిన గీతాలు భక్తి భావాన్ని పెంపొందింపజేసేలా ఉంటాయి. ఇందులో ఎనిమిది పాటలుంటాయి. వాటితో పాటు ఏడు స్వల్ప నిడివి గీతాలున్నాయి. వీటిని జొన్నవిత్తుల రచించారన్నారు.
చిత్ర విశేషాలు గురించి చెబుతూ.. రామాయణం అందరికీ తెలిసిన కథే. అయినా ప్రతిసారీ ఏదో ఓ కొత్త విషయం మనకు బోధపడుతుంటుంది. ఈ కథని బాపు తనదైన శైలిలో ఆవిష్కరించారు. ప్రతి సన్నివేశంలోనూ బాపు - రమణల ముద్ర కనిపిస్తుంది. రామునిగా బాలకృష్ణ, సీతగా నయనతార తమ పాత్రలో ఒదిగిపోయారు. వారి నటన అన్ని వయసులవారికి నచ్చుతుంది. రామోజీ ఫిల్మ్సిటీలో ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా నాలుగు సెట్లను నిర్మించాం. దర్బారు, కౌసల్య మందిరం, పూజా మందిరం, ఏకాంత మందిరం సెట్లు కనువిందు చేస్తాయి. వీటిని కళాదర్శకుడు కిరణ్ తీర్చిదిద్దారు. మరో కళా దర్శకుడు రవీందర్ ఆధ్వర్యంలో 14 ఆశ్రమాలను నిర్మించాం అన్నారు. ఇటీవలే డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.