Don't Miss!
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
గుండెజారి గల్లంతయ్యిందే చిత్ర దర్శకుడిపై దాడి
యువ హీరో నితిన్తో ‘గుండెజారి గల్లంతయ్యిందే’ చిత్రం రూపొందించిన దర్శకుడు విజయ్కుమార్ కొండాపై దాడి జరిగింది.
యువ హీరో నితిన్తో 'గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రం రూపొందించిన దర్శకుడు విజయ్కుమార్ కొండాపై దాడి జరిగింది. కొండా భార్య ప్రసూన తల్లి ఆయనపై దాడి చేసినట్టు సమాచారం. తన కుమార్తె ప్రసూనకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని విజయ్ కుమార్పై ప్రసూన తల్లి స్వరూపారాణి ఆరోపించింది. హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగింది.
ప్రసూనను దర్శకుడు కొండా విజయ్ కుమార్ మార్చి 1 తేదీన ప్రేమ వివాహం చేసుకొన్న సంగతి తెలిసిందే. చాలాకాలంగా ప్రేమించుకొంటున్న విజయ్ , ప్రసూన పెద్దల ఎదురించి ప్రేళ్లి చేసుకొన్నారు. ఈ వివాహానికి విజయ్ కుటుంబంతో పాటు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
దాడి నేపథ్యంలో ప్రసూన కుటుంబ సభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలని విజయ్కుమార్ కొండ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. ప్రసూన తల్లి దండ్రుల నుంచి ముప్పు ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉన్నది.