Just In
- 5 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 5 hrs ago
పబ్లిక్ ప్లేస్లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్తో భర్తతో శ్రియ రచ్చ
- 6 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 6 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
కూరగాయాలకు మద్దతు ధర, సీఎం కేసీఆర్ స్పష్టీకరణ..?
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ట్విట్టర్లో...రాజమౌళికి స్టార్ హీరో ఫ్యాన్ ఝలక్!
హైదరాబాద్ : స్టార్ దర్శకుడు రాజమౌళి ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటూ తన అభిమానులతో ఎప్పటికప్పుడు తన అనుభవాలను పంచుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాజమౌళికి ట్విట్టర్లో ఊహించని అనుభవం ఎదురైంది. గత సంవత్సరం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఓ స్టార్ హీరో అభిమాని రాజమౌళి చేసిన ట్వీట్పై కాస్త రాష్గా స్పందించాడు. అయితే రాజమౌళి సమయస్ఫూర్తితో అతడానికి ప్రతిజవాబు ఇచ్చాడు.
ఇక్కడ కనిపిస్తున్న ఫోటో...రాజమౌళి షాంఘై టూర్కు సంబంధించింది. రాజమౌళి పోస్టు చేసిన ఈ ఫోటోపై ఓ వ్యక్తి స్పందిస్తూ....'నువ్వు తాగావని తెలుసు, ట్వీట్ చేయడం ఆపి వెళ్లి పడుకో' అంటూ కామెంట్ చేసాడు. దీనికి రాజమౌళి స్పందిస్తూ 'యు ఆర్ రైట్...ఎక్సైట్మెంట్తో తాగాను...దాని మీనింగ్ ఏమిటో నీకు తెలుసా?...నీ సూచనలు ఎప్పుడూ స్వీకరిస్తా' అంటూ రిప్లై ఇచ్చాడు.
షాంఘైలో జరుగుతున్న 16వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రత్యేక ప్రదర్శనకు రాజమౌళి 'ఈగ' ఎంపికైంది. అందులో పాల్గొనేందుకు చిత్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కూడా షాంఘై వెళ్లారు. ఈగ చిత్రాన్ని ఈ సంవత్సరాంతానికల్లా చైనాలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ ఈ చిత్రానికి 'కుంగ్ ఫూ హౌస్ ఫ్లై' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
రాజమౌళి 'ఈగ' ప్రదర్శనలో పాల్గొనడంతో పాటు, ఆయన తెరకెక్కించనున్న 'బాహుబలి' కోసం లొకేషన్లను కూడా పరిశీలిస్తారు. ఆ విషయాన్ని రాజమౌళి ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రభాస్ హీరోగా 'బాహుబలి' చిత్రం రూపొందుతోంది. అనుష్క హీరోయిన్ . రానా ప్రధానమైన పాత్రను పోషిస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న చిత్రమిది.