Don't Miss!
- News TTD: శ్రీవారి దర్శనం , సేవలు, వసతి గదుల కోటా విడుదల...!!
- Sports వరల్డ్ కప్కు దూబె ఎంపికైనట్లే.. కానీ ఓ సమస్య- డివిలియర్స్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
రామ్ చరణ్, అఖిల్ వెలుతున్నారు... ఇలియానా ఇలా అనేసిందేంటి?
హైదరాబాద్: కాశ్మీరీ పండిట్లపై జరిగిన ఉగ్రవాద దాడుల్లో నష్టపోయినవారిని ఆదుకోవడానికి శల్లి కుమార్ అనే వ్యక్తి ఛారిటీ కాన్సెర్ట్ ను ఏర్పాటుచేసారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఈనెల 15న జరుగబోయే ఈవెంట్ లో సినీతారలు పాల్గొని పర్ఫార్మెన్స్ లు చేయనున్నారు.
ఈ ఈవెంట్ లో అఖిల్, రామ్ చరణ్ , శ్రియసరన్, ప్రభుదేవా, మలైకా అరోరా, సోఫీ చౌదరిలు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోనాల్డ్ ట్రంప్ హాజరుకాకున్నారు. అయితే ఈ కార్యక్రమానికి తాను వెళ్లబోనని, అమెరికా రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మద్దతివ్వనని ప్రముఖ సినీ నటి ఇలియానా డిక్రూజ్ తేల్చి చెప్పింది.
నో చెప్పిన ఇలియానా
ఈ కార్యక్రమంలో ఇందులో పాల్గొనేందుకు సౌత్ నుండి రామ్ చరణ్, అఖిల్, శ్రీయ, ప్రభుదేవా లాంటి స్టార్స్ బాలీవుడ్ నుండి మలైకా అరోరా, సోపీచౌదరి లాంటి వారు అంగీకరించారు. అయితే ఇలియానా మాత్రం నో చెప్పింది.
ట్రంప్ కారణంగానే
ఈ చారిటీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ట్రంప్ పాల్గొంటున్న కారణంగానే ఇలియానా పాల్గొనేందుకు గీకరించలేదు. ఈ కార్యక్రమంలో పాల్గొంటే ట్రంప్ కి సపోర్ట్ చేయడమే అని ఇలియానా భావన.
ఇలియానా తీరుపై విమర్శలు
అయితే ఇలియానా తీరును కొంత మంది తప్పుబడుతున్నారు. ఒక మంచి కార్యక్రమం జరిగేటప్పుడు అందులో రకరకాల వ్యక్తులు పాల్గొంటారు. వారిలో చెడ్డ వారు ఉండొచ్చు, మంచి వారు ఉండొచ్చు. అంతే కానీ ట్రంప్ వస్తున్నాడని ఆమె కార్యక్రమానికి దూరం కావడం అర్థం లేని విషయమే అంటున్నారు.
శ్రీయ
ఈ చారిటీ కార్యక్రమానికి సంబంధించి ఇటీవల హైద్రాబాద్ లో జరిగిన ప్రమోషన్ కార్యక్రమంలో హీరోయిన్ శ్రియ పాల్గొన్నారు. ఇలాంటి ఛారిటీ కార్యక్రమాల్లో పాల్గొడం చాలా సంతోషంగా ఉందని శ్రియ తెలిపారు. ఉగ్రవాద దాడుల్లో నష్టపోయిన వారికోసం పెర్ఫార్మ్ చేయడం మా బాధ్యత అనుకొనే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. పలు సినిమా పాటలకు పెర్ఫార్మ్ చేయనున్నట్లు శ్రీయ తెలిపారు.