ఇంద్రాణి నా అభిమాని: రాఖీ సావంత్, ఆసక్తిర విషయాలు చెప్పింది
ముంబై: ఇంద్రాణి ముఖర్జియా ఒకప్పుడు తనకు పెద్ద అభిమాని అని ప్రముఖ నటి, ఐటం డ్యాన్సర్ రాఖీ సావంత్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కూతురు షీనా బోరా హత్య కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జీయా ప్రధాన నిందితురాలు. ఈ కేసును పోలీసులు దర్యాఫ్తు చేస్తోన్న విషయం తెలిసిందే.
షీనా హత్య కేసు ఆధారంగా ఏక్ కహానీ జూలీ కీ అనే సినిమా తెరకెక్కుతున్నట్లుగా తెలుస్తోంది. అందులో ప్రధాన పాత్రలో రాఖీ సావంత్ నటించనుంది. ఈ విషయమై మీడియాతో మాట్లాడారు. తనకి షీనా బోరా, ఇంద్రాణి ముఖర్జియా, పీటర్ ముఖర్జియా బాగా పరిచయస్తులన్నారు.

పీటర్ ముఖర్జియా నిర్మాణంలో వచ్చిన రియాల్టీ షోలు జరుగుతున్నప్పుడు షూటింగ్ సమయంలో సెట్లో కలిసినట్లు చెప్పింది. కాగా, రాఖీ సావంత్ తాజా ఈ చిత్రం షీనా బోరా హత్య కేసు ఆధారంగా ఉంటున్నట్లు చెబుతుండటం గమనార్హం.
ఇంద్రాణి గురించి ప్రతి ఒక్క విషయం తెలుసని, అందుకే ఈ సినిమాలో తనకంటే బాగా ఎవరూ నటించలేరని చెప్పింది. ఈ సినిమాకి అవధ్ శర్మ నిర్మాత. ఇందులో ఇంద్రాణి పాత్రలో రాఖీ సావంత్ నటిస్తోంది. రాఖీ మాట్లాడుతూ.. ఇంద్రాణి ఎప్పుడు ఒత్తిడితో జీవించలేదన్నారు.


Click it and Unblock the Notifications











