Don't Miss!
- Sports ధోనీ సార్ ధోనీ.. అంతే: సౌండ్ లెవెల్ ఏ రేంజ్లో ఉందంటే..
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఇంద్రాణి నా అభిమాని: రాఖీ సావంత్, ఆసక్తిర విషయాలు చెప్పింది
ముంబై: ఇంద్రాణి ముఖర్జియా ఒకప్పుడు తనకు పెద్ద అభిమాని అని ప్రముఖ నటి, ఐటం డ్యాన్సర్ రాఖీ సావంత్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కూతురు షీనా బోరా హత్య కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జీయా ప్రధాన నిందితురాలు. ఈ కేసును పోలీసులు దర్యాఫ్తు చేస్తోన్న విషయం తెలిసిందే.
షీనా హత్య కేసు ఆధారంగా ఏక్ కహానీ జూలీ కీ అనే సినిమా తెరకెక్కుతున్నట్లుగా తెలుస్తోంది. అందులో ప్రధాన పాత్రలో రాఖీ సావంత్ నటించనుంది. ఈ విషయమై మీడియాతో మాట్లాడారు. తనకి షీనా బోరా, ఇంద్రాణి ముఖర్జియా, పీటర్ ముఖర్జియా బాగా పరిచయస్తులన్నారు.
పీటర్ ముఖర్జియా నిర్మాణంలో వచ్చిన రియాల్టీ షోలు జరుగుతున్నప్పుడు షూటింగ్ సమయంలో సెట్లో కలిసినట్లు చెప్పింది. కాగా, రాఖీ సావంత్ తాజా ఈ చిత్రం షీనా బోరా హత్య కేసు ఆధారంగా ఉంటున్నట్లు చెబుతుండటం గమనార్హం.
ఇంద్రాణి గురించి ప్రతి ఒక్క విషయం తెలుసని, అందుకే ఈ సినిమాలో తనకంటే బాగా ఎవరూ నటించలేరని చెప్పింది. ఈ సినిమాకి అవధ్ శర్మ నిర్మాత. ఇందులో ఇంద్రాణి పాత్రలో రాఖీ సావంత్ నటిస్తోంది. రాఖీ మాట్లాడుతూ.. ఇంద్రాణి ఎప్పుడు ఒత్తిడితో జీవించలేదన్నారు.