Don't Miss!
- News తెలంగాణా కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు నేడే: కాంగ్రెస్ సిఈసి భేటీకి సీఎం రేవంత్ రెడ్డి!!
- Finance Telecom News: వినియోగదారులకు టెలికాం కంపెనీల వాత.. ముహూర్తం ఫిక్స్..
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్పై వేటు!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Automobiles రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
ఓటు కోసం డుమ్మా కొడుతున్న హీరోయిన్
ముంబై: ఓటు వేయడం ఎంత ముఖ్యమైన అంశమో తెలియజేసే ప్రయత్నం చేస్తోంది బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్. ఓటు విషయమై ఆమె మాట్లాడుతూ....ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అవార్డులకు నాకు ఆహ్వానందం అందిందని, అయితే అదే సమయంలో ఎలక్షన్ ఉండటం వలను తాను ఆ కార్యక్రమానికి వెళ్లడం లేదని, ఏప్రిల్ 24వ తేదీన ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతోనే తాను ఆ అవార్డుల కార్యక్రమానికి గైర్హాజరవుతున్నట్లు తెలిపింది.
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమం ఫ్లోరిడాలోని టంపా బేలో ఈ నెల 23 నుండి 26 వరకు జరుగనుంది. ముంబై 24వ తేదీన ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ముంబైలో ఉండే చాలా మంది సినిమా స్టార్లు ఓటు వేయడాన్ని పెద్దగా లెక్కలోకి తీసుకోకుండా అవార్డుల కార్యక్రమానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
కానీ సోహా అలీ ఖాన్ మాత్రం....మిగతా స్టార్లు భిన్నంగా ఓటు వేయడం కోసం ఆ అవార్డుల కార్యక్రమానికి డుమ్మా కొట్టాలని నిర్ణయించుకుంది. అయితే ఓటు వేయకుండా డుమ్మా కొడుతున్న ఇతర స్టార్ల గురించి మాట్లాడటానికి సోహా అలీ ఖాన్ నిరాకరించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అసరం ఉందని వ్యాఖ్యానించారు.
యువత రాజకీయాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని, దేశానికి మంచి నాయకత్వం రావాలంటే ప్రతి ఒక్కరికి రాజకీయాలపై అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని, మంచి భవిష్యత్ కోసం మంచి వ్యక్తులకు ఓటు వేసి గెలిపించాలని సోహా అలీ ఖాన్ కోరుతోంది. ఓటే వేయనప్పుడు ప్రశ్నించే హక్కు ఉండదని ఆమె వ్యాఖ్యానించారు.