Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రజినీకాంత్ తప్ప ఇంకేం లేదా?: సూపర్ స్టార్ మీద విరుచుకుపడింది
"రజనీ తప్ప మీకు మిగతా విషయాలు పట్టవా? ఆయన రాజకీయాగమనం గురించి మాత్రమే ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు? అంటూ తమిళ, జాతీయ మీడియాలపై ప్రముఖ తమిళ సినీ నటి కస్తూరి చిరాకు పడింది.
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఏదో ఒక సమస్యని పట్టుకునే ఉంటాయి. కొన్నాళ్ళ పాటు అది తప్ప ఇంకో సమస్యే లేనట్టు పతాక శీర్షికలన్నీ ఒకే విషయాన్ని ఊదరగొడుతూంటాయి. అమ్మ మరణం తర్వాత తమిళ రాజకీయాల రూపురేఖలే మారి పోయాయి. ముఖ్య మంత్రులు మారటం, ఊహించని విధంగా శశికళ జైలు పాలు కావటం ఇలా పెను మార్పులు వచ్చాయి.. అయినా సరే ఇప్పుడు తమిళ మీడియా దృష్టి మాత్రం కేవలం రజినీ కాంత్ రాజకీయ ప్రవేశం చుట్టూనే ఉంది. ఇదే తరహా వార్తలను చూసి బోరుకొడుతోంది.. ఇంక వేరే విషయాలే లేవా? అంటూ తమిళ నటి కస్తూరీ చురకలు వేసింది.
రజనీ తప్ప సమస్యలేవీ కనిపించడం లేదా?
"రజనీ తప్ప మీకు మిగతా విషయాలు పట్టవా? ఆయన రాజకీయాగమనం గురించి మాత్రమే ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు? తమిళ ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలేవీ కనిపించడం లేదా?" అంటూ తమిళ, జాతీయ మీడియాలపై ప్రముఖ తమిళ సినీ నటి కస్తూరి చిరాకు పడింది..
అయితే
కస్తూరి ఇలా రజినీ విషయం లో జోక్యం చేసుకోవటం మొదటిసారి కాదు.. గత నెలలో కూడా 'రజనీ.. యుద్ధం (పోర్) అంటున్న మీ మాటలు విని బోర్ కొడుతోంది స్వామి. రాజకీయ ప్రవేశంపై స్పష్టమైన ప్రకటన చేయకుండా పోరు వచ్చినప్పుడు చూసుకుందామని రజనీకాంత్ చేస్తున్న ప్రకటనలు బోర్ కొడుతున్నాయి. అనిశ్చితి పరిస్థితిలోను స్థిరమైన నిర్ణయాన్ని తక్షణం తీసుకునే వాడే నిజమైన రాజకీయ నాయకుడు. రజనీ కూడా ఏదో ఒక స్థిరమైన నిర్ణయాన్ని త్వరగా తీసుకోవాలి' అని కస్తూరి ట్వీట్ చేసింది.
నోరు మూసుకో
దీనిపై రజనీకాంత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెపై విరుచుకు పడ్డారు. 'నువ్వు కూడా రజనీకాంత్ గురించి మాట్లాడుతున్నావా.. అంతా టైమ్.. ఏం చేస్తాం.. నోరు మూసుకొని పోవే' అని ఓ అభిమాని దురుసు స్పందనకు. అంతే స్పీడ్ గా అంతే వాడిగా సమాధానం చెప్పింది.. మిస్టర్..! నువ్వు పుట్టక ముందు నుంచి నేను రజనీకాంత్ అభిమానిని అని, నీలాంటి మర్యాదలేని అభిమానుల వల్ల ఆయనకు చెడ్డపేరు, అవమానం.. ముందు నీ నోరు మూసుకో అని హితవు పలికింది.
మళ్ళీ రజినిని ప్రస్తావనకు తెస్తూ
ఇప్పుడు మళ్ళీ రజినిని ప్రస్తావనకు తెస్తూ ఇంకోసారి వార్తల్లోకి ఎక్కింది. గత డిసెంబర్లో అమ్మ చనిపోయాక రాష్ట్రంలో శూన్యత ఆవరించి ఉంది. ఓ మంచి వ్యక్తి ఆ శూన్యాన్ని భర్తీ చేయాల్సిన అవసరముంది. అయితే, రజనీ రాజకీయాల్లోకి వస్తారా? రారా? అంటూ ఊదరగొట్టేయడం సబబు కాదని ఆమె అభిప్రయాపడింది.
మార్పు దిశగా రజనీ
కస్తూరి ఇటీవల రజనీకాంత్ను కలిసినపుడు ఆయన రాజకీయ అభిప్రాయాలు తెలుసుకున్నానని ఆమె ట్విట్టర్లో పేర్కొన్నారు. త్వరలోనే మార్పు దిశగా రజనీ అడుగులు వేసే అవకాశముందని ఆమె చెప్పారు. అభిమానులతో ఫొటో సెషన్ సందర్భంగా దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తానని రజనీ ప్రకటించిన సంగతి తెలిసిందే.