Don't Miss!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
హృతిక్-కంగనాల వివాదం లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ...
బాలీవుడ్ లో ఇప్పుడున్న హాట్ టాపిక్ ఏమటీ అంటే మారిన మాజీ ప్రేమికులు హృతిక్ రోషన్, కంగనారనౌత్ ల వివాదమే. ఇప్పుడు బీ-టౌన్ లో ఎక్కువ మంది మాట్లాడుకునే సంగతి హృతిక్ రోషన్, కంగనారనౌత్ ల గొడవే... తాజాగా నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వీరి మధ్య గొడవ పై స్పందించింది. హృతిక్, కంగనాల మధ్య ఏర్పడిన వివాదం త్వరలోనే ముగుస్తుందని ఆశాభావం వ్యక్తంచేసింది.
ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫెర్నాండెజ్.. 'హృతిక్-కంగనాల వివాదం త్వరలోనే సమసిపోతుంది. దీనివల్ల ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసు. ఇప్పట్నుంచి వారిద్దరూ సరైన పంథాలో వెళ్లాలి. ఇద్దరూ ఓ నిర్ణయానికి వస్తారని భావిస్తున్నా' అని చెప్పింది.
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధార్థ మల్హోత్రా కూడా ఇదే విషయం పై మాట్లాడుతూ హృతిక్, కంగనాల వివాదం వారి వ్యక్తిగతమని అన్నాడు. వారి విషయం తనకు తెలియదని, దీని గురించి మాట్లాడే హక్కు లేదని చెప్పాడు.
హృతిక్, కంగనాల మధ్య విభేదాలు ఏర్పడ్డాక పరస్పరం లీగల్ నోటీసులు ఇచ్చారు. కంగనా పంపిన్ మెయిల్స్ ను హృతిక్ బయటపెట్టడంతో గొడవ మరింత పెద్దదై పత్రికలకెక్కింది. తన మెయిల్ ను హ్యాక్ చేసింది కాక తర్వాత, తన పేరుతో ఫేక్ ఈమెయిల్ అకౌంట్ ఉందంటూ హృతిక్ ఫిర్యాదు చేయడంపై కంగనా ప్రశ్నించింది. అప్పటినుంచి ఈ వివాదం రోజుకో మలుపుతిరుగుతూ మరింత ముదిరింది.