ఫొటోలు : ఫామ్ హౌస్ లో 'జనతాగ్యారేజ్' టీమ్ మిడ్ నైట్ పార్టీ
హైదరాబాద్ : తొలి రోజు బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ ను రాబట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' చిత్రం నిన్న రెండవ రోజు కూడా అదే జోరు కొనసాగిస్తూ దూసుకు వెళ్లిన సంగతి తెలిసిందే. మూడో రోజు అంటే ఈ రోజు శనివారం కూడా జనతాగ్యారేజ్ భాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఈ నేఫద్యంలో జనతాగ్యారేజ్ టీమ్ నిన్న ఫామ్ హౌస్ లో మిడ్ నైట్ పార్టీ జరుపుకుంది. ఈ పార్టీ ఫొటోలను మీరు ఈ క్రింద చూడవచ్చు.
టాక్ డివైడ్ గా ఉన్నప్పటికి సినిమా సూపర్ హిట్ కలెక్షన్స్ రాబట్టడుతూండటంతో నిర్మాతలు చాలా ఖుషీగా ఉన్నారు. తాను డిఫెరెంట్ గా చేసిన చిత్రం సక్సెస్ అవటంతో ఎన్టీఆర్ ఆనందానికి అంతేలేదు. ఇక దర్శకుడు కొరటాల శివ సంగతి అయితే చెప్పక్కర్లేదు.
పైగా ఈరోజు వీకెండ్, రేపు ఆదివారం కావడం, ఆ పై రోజు వినాయకచవితి సెలవు కావడం, పైగా మరో పెద్ద చిత్రం లేకపోవడం ఈ సినిమాకు బాగా కలిసొచ్చిన అంశం. మొదటిరోజైతే ఈ చిత్రం కొన్ని చోట్ల 'బాహబలి' రికార్డులను కూడా దాటేసినటు తెలుస్తోంది. ఈ ఘన విజయంతో దర్శకుడు కొరటాల శివ, హీరో తారక్ లు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు.
పార్టీ ఫొటోలు మీరు ఈ క్రింద చూడవచ్చు....

మూడ్
ఈ ఫొటోలలో ఎన్టీఆర్ ఎంత ఆనందంగా ఉన్నాడో మీరు చూడవచ్చు.

నైజాం కింగ్
నైజాం ఏరియా ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు ...చాలా ఉత్సాహంగా ఈ పార్టీలో పాల్గొన్నారు.

స్పెషల్ పార్టీ
ఎన్టీఆర్ సైతం ఓ స్పెషల్ పార్టీని వీరందరికీ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది

18 కోట్లు
దిల్ రాజు ఫుల్ రన్ లో 18 కోట్లు సంపాదిస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు

విమర్శలు వచ్చినా
సినిమాపై విమర్శలు వచ్చిన వాటిని కొరటాల శివ ప్రెస్ మీట్ లో కొట్టిపారేసాడు.

సంతృప్తి ఇచ్చింది
‘‘ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య విడుదలైన మా ‘జనతా గ్యారేజ్'కి అభిమానుల్నుంచే కాకుండా... అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచీ మంచి స్పందన లభిస్తుండడం సంతృప్తినిచ్చింది'' అన్నారు కొరటాల శివ.

డబ్బింగ్ లా కాకుండా...
‘నా కెరీర్లో ఇదొక డబ్బింగ్ సినిమా అవుతుందనుకొంటే, నేరుగా చేసిన నా సినిమాల స్థాయిలో ప్రేక్షకుల్ని అలరిస్తోంద'అని మోహన్లాల్ చెప్పారు.

మహేష్ తో నెక్ట్స్
కొంత విరామం తీసుకొని మహేష్బాబు సినిమా కోసం రంగంలోకి దిగుతా'' కొరటాల శివ అన్నారు.


Click it and Unblock the Notifications











