Don't Miss!
- News వాట్సప్ లో మరో అదిరిపోయే కొత్త ఫీచర్; ఆఫ్ లైన్ లోనూ షేరింగ్.. ఇక రచ్చేనా!!
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
భాగ్యనగరంలోనికి ఎంటర్ అయిన యంగ్ టైగర్...
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'శక్తి" సినిమా షూటింగ్ కోసం కులుమనాలీ, హరిద్వార్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ దాదాపు నెల రోజుల పాటు షూటింగ్ జరిగింది. హైదరాబాద్ ను ఇన్ని రోజులు మిస్ అయినందుకు బాధ పడిన ఎన్టీఆర్ మనాలీలో షూటింగ్ ముగియడంతో ఆనందంగా ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో అడుగు పెట్టాడు యంగ్ టైగర్. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగగానే తనకు కొత్త ఉత్సాహం వచ్చిందని ఎన్టీఆర్ తెలిపాడు. వారం పాటు విశ్రాంతి తీసుకుని 'బృందావనం" షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.
బృందావనం షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ ఈ నెల 18 నుంచి జరుగనుంది. రెండు చిత్రాలను ఏకకాలంలో పూర్తి చేయడం విశేషం. బృందావనం చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే క్లైమాక్స్ చిత్రీకరణ శంషాబాద్లో జరిగింది. ఇంకా రెండు పాటలు కొంత ప్యాచ్ వర్క్ చేయాల్సి ఉంది. వీటిని ఈ నెలఖారులో పూర్తి చేయనున్నారు. ఈ నెలలోనే ఆడియోను విడుదల చేయనున్నట్లు నిర్మాత దిల్ రాజు చెప్పారు.