‘ఓం’ : దర్గాలో ప్రత్యక్షమైన కళ్యాణ్ రామ్

By Bojja Kumar

హైదరాబాద్ : నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన 3డి చిత్రం 'ఓం' ఈ నెల 19న విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో సక్సెస్ కావాలని కోరుకుంటూ ఆయన ఈ రోజు ఉదయం కడప జిల్లాలోని ప్రఖ్యాత పెద్ద దర్గాను సందర్శించి మొక్కులు సమర్పించారు.

కడప జిల్లా పెద్ద దర్గాను సందర్శించడం సినిమా వాళ్లకి ఎప్పటి నుండో ఓ సెంటిమెంటుగా మారింది. గతంలో పలు మార్లు టాలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు ఈ దర్గాను సందర్శించారు. ముఖ్యంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ దర్గాకు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వస్తారు.

'ఓం' సినిమా వివరాల్లోకి వెళితే...

కృతి కర్బందా, నికీషా పటేల్‌ హీరోయిన్స్. సునీల్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్‌ బేనర్‌పై కళ్యాణ్ రామే నిర్మిస్తున్నారు. 3డిలో రూపొందుతున్న 'ఓం' ఈ చిత్రానికి హాలీవుడ్ చిత్రాలైన స్టెప్ అప్ 3డి, ఫైనల్ డెస్టినేషన్, అవతార్, స్పైడర్ మ్యాన్ 4 లాంటి చిత్రాలకు పని చేసిన టెక్నీషన్స్ పని చేస్తున్నారు. ఆచు, సాయి కార్తీ సంగీతం అందించారు.

దాదాపు 20 కోట్ల పైచిలుకు ఖర్చుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కళ్యాణ్ ఉన్న మార్కెట్ కంటే ఇది అధిక మొత్తం. అయినా సరే సక్సెస్ అవుతుందనే నమ్మకంతో సాహసోపేతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో కార్తీక్‌, సురేష్‌, రావు రమేష్‌, రఘు, సితార తదితరులు నటించారు. కూర్పు: గౌతమ్‌రాజు, కళ: కిరణ్‌, స్టీరియోగ్రాఫర్స్‌: డేవిడ్‌ మైక్‌టేలర్‌, మార్కస్‌, మజ జ్డోవిన్‌స్కీ; ఫైట్స్‌: విజయ్‌, రవివర్మ; సంగీతం: అచ్చు, సాయికార్తీక్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X