Don't Miss!
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
అనుష్క కెరీర్ను నాశనం చేయాలనుకున్నదెవరు?
ముంబై: బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ తెరకెక్కించిన చిత్రం 'యే దిల్ హై ముష్కిల్'. ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్, రణబీర్ కపూర్ తో పాటు అనుష్క శర్మ కూడా ప్రధాన పాత్రలో నటించింది. అయితే ఒకప్పుడు ఇదే కరణ్ జోహార్ అనుష్క కెరీర్ నాశనం చేయాలనుకున్నాడట.
మామి ఫిల్మ్ ఫెస్టివల్ లో జరిగిన కార్యక్రమంలో రాజీవ్ మసంద్తో జరిగిన ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. యశ్రాజ్ ఫిలింస్ వారు షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కించిన 'రబ్ నే బనాదీ జోడీ' సినిమా ద్వారా అనుష్క శర్మ హీరోయిన్ గా పరిచయం అయింది.
అనుష్కను తీసుకునే ముందు... అపుడు యశ్ రాజ్ ఫిలింస్ వైస్ ప్రెసిడెంటుగా ఉన్న ఆదిత్య చోప్రా.... అనుష్క శర్మ ఫోటోలను కరణ్ జోహార్ కు చూపించారట. అయితే కరణ్ కు ఆమె నచ్చలేదు, అనుష్కను తీసుకోవద్దని సూచించాడట.
అయితే ఆదిత్య చోప్రా.... కరణ్ జోహార్ సూచన పట్టించుకోకుండా అనుష్క శర్మను ఆ సినిమాకి తీసుకున్నాడు. అయితే బ్యాండ్ బాజా బారాత్ సినిమా విడుదలయ్యాక అనుష్కలోని టాలెంట్ ను గుర్తించి తాను.... ఆమె గురించి పూర్తిగా తెలుసుకోకుండా అనవసరంగా ఆమె కెరీర్ నాశనం చేయాలనుకున్నాను అని పీలయ్యాడట కరణ్ జోహార్.