Don't Miss!
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- News తెలంగాణలో నామినేషన్లను దాఖలు చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Sports IPL 2024: ఆ తెలుగు టీమ్ సాంగ్ ముందు ఏది పనికి రాదు: రోహిత్ శర్మ వీడియో
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ముంబైలో ‘బిజినెస్’ డీల్ కి మహేష్ రెడీ...!
మహేష్ బాబు కథానాయకుడుగా పూరీ జగన్నాథ్ 'ది బిజినెస్ మేన్" పేరిట ఓ భారీ చిత్రాన్ని రూపొందించడానికి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన డైలాగ్ వెర్షన్ ను దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇటీవలే పూర్తి చేశారు. మామూలుగా తన ప్రతి చిత్రానికి సంబంధించిన స్క్రిప్టును బ్యాంకాక్ వెళ్లి రాసుకుంటారాయన. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా అక్కడే పూర్తి చేసుకుని వచ్చారు.
కాగా, సినిమా షూటింగుకి సంబంధించిన లొకేషన్ల ఎంపిక కోసం పూరిజగన్నాథ్ నిన్న ముంబై బయలుదేరి వెళ్లారు. ఈ సినిమా షూటింగు ఎక్కువ భాగం ముంబైలోనే ప్లాన్ చేస్తున్నారాయన. కాజల్ కథానాయికగా నటించే ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.మూవీ మేకర్స్ అధినేత వెంకట్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు చేస్తున్న 'దూకుడు' సినిమా పూర్తయ్యాక ఇది మొదలవుతుందని అంటున్నారు. మహేష్ సరసన కాజల్ తొలిసారిగా నటిస్తోందన్నమాట!
ఈ చిత్రంలో మహేష్ బాబు ఒక డైనమిక్ రోల్ చేస్తున్నాడని సమాచారం. ఇటువంటి పాత్ర ఇంతకుముందెన్నడూ చేయలేదని, ఈ చిత్రంలో మహేష్ పాత్ర హైలెట్ అంటున్నారు. ఈ చిత్రంషూటింగ్ త్వరలో ప్రారంమై సంక్రాంతి రోజు12 ,2012కి సనిమా విడుదలకు ప్లాన్ చేసే విధంగా షూటింగ్ ను వేగవంతం చేయదలచుకొన్నారు.