వీర్యదాత కోసం ఎదురు చూస్తున్న దర్శకుడు

దాదాపు సంవత్సరం తర్వాత మధుర శ్రీధర్ ఈ ప్రాజెక్టు గురించి ప్రకటించారు. సినిమా చిత్రీకరణకు అంతా సిద్ధమైందని, అయితే కథకు సరిపోయే కథానాయకుడు దొరకడం లేదని అంటున్నాడు మధుర్ శ్రీధర్. త్వరలోనే సబ్జెక్టుకు సూటయ్యే హీరోను వెతికి పట్టుకుంటానంటున్నాడు.
గతంలో ఈచిత్రం కోసం మధుర శ్రీధర్ హీరో నానిని సంప్రదించాడు. అయితే నాని బ్యాండ్ బాజా భారత్, జెండాపై కపిరాజు చిత్రాలతో బిజీగా ఉండటంతో హీరో రానాతో ఈచిత్రం చేయాలనుకున్నాడు. అయితే రానా కూడా రుద్రమదేవి, బాహుబలి చిత్రాలతో బిజీగా ఉండటంతో కుదరదనిచెప్పాడు.
ప్రస్తుతం మధుర శ్రీధర్ కన్ను బస్టాప్, నీకు నాకు చిత్రాల హీరో ప్రిన్స్పై పడింది. ఈచిత్రం కోసం కొన్ని కిలోల బరువు తగ్గాలని సూచించాడట. అయితే ప్రిన్స్ కూడా ఈ ప్రాజెక్టుకు ఫైనల్ కాలేదని తెలుస్తోంది. దీంతో కొత్త వారితోనే సినిమా చేయాలని నిర్ణయించినట్లు మధుర శ్రీధర్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











