Just In
- 15 min ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 1 hr ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
- 1 hr ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 2 hrs ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్పై నటి కామెంట్స్
Don't Miss!
- News
50 దేశాలకు విస్తరించిన యూకే కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ .. ఇండియాలో కేసులు ఎన్నంటే
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Finance
భారత్ నుంచి యూకేకు స్టార్ స్ట్రీక్ క్షిపణులు: టెక్నాలజీ భాగస్వామిగా, ఇతర దేశాలకు కూడా
- Lifestyle
వెల్లుల్లి పూర్తి ప్రయోజనం పొందడానికి ఎలా తినాలో మీకు తెలుసా?ఇక్కడ చదవండి ...
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సూపర్ స్టార్ శకం అలా మొదలైంది: మహేశ్కు శుభాకాంక్షలు చెప్పిన నమ్రత
తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. సీనియర్ హీరో కృష్ణ కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించిన అతడు.. చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో గుర్తుండిపోయే పాత్రలను పోషించాడు. ఆ తర్వాత 'రాజకుమారుడు' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడని మహేశ్.. వరుస హిట్లతో సూపర్ స్టార్ అయిపోయాడు. ఇక, ఈ మధ్య హ్యాట్రిక్ విజయాలను అందుకుని సత్తా చాటాడు. ఇలాంటి తరుణంలో మహేశ్ బాబు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 41 వసంతాలు పూర్తి చేసుకున్నాడు.
మహేశ్ బాబు చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన మొదటి చిత్రం 'నీడ'. ఇది విడుదలై ఆదివారంతో 41 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో 41YrsOfSSMBMasteryInTFI అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. ఈ క్రమంలోనే ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ సూపర్ స్టార్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో '41 వసంతాలు పూర్తి చేసుకున్న సూపర్ స్టార్ మహేశ్ బాబుకు శుభాకాంక్షలు. ఇలాంటి మైలురాళ్లు ఎన్నో ఎన్నెన్నో చేరుకోవాలని ఆశిస్తున్నా. మహేశ్ శకానికి 41 ఏళ్లు' అని పోస్ట్ చేశారు.

ఇదిలా ఉండగా, మహేశ్ బాబు ప్రస్తుతం పరశురాంతో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ జనవరి నుంచి ప్రారంభం కాబోతుంది. ఇందులో సూపర్ స్టార్ బ్యాంక్లను మోసం చేస్తున్న బడా బాబులపై పోరాటం చేయబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ సంస్థతో కలిసి ఈ సినిమాను మహేశ్ బాబు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా చేస్తోంది. అలాగే, పలువురు నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.