Don't Miss!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘భరత్ అనే నేను’ టీంకు ఐఫోన్లు గిఫ్టుగా ఇచ్చిన మహేష్ బాబు!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'భరత్ అనే నేను'. గతంలో ఏ సినిమాకు లేనంత కాన్ఫిడెన్స్తో ఉన్న మహేష్ ఈ చిత్ర బృందంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఐఫోన్ ఎక్స్ ఫోన్లు గిఫ్టుగా అందించారు. ఒక్కో ఫోన్ విలువ రూ. 80 వేలకు పైనే ఉంటుందని అంచనా.
మహేష్ బాబు భార్య నమ్రత స్వయంగా తన చేతుల మీదుగా ఈ బహుమతులను అందజేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బహుమతితో పాటు వారిని అప్రిషియేట్ చేస్తూ ఓ చిన్న లెటర్ కూడా గిఫ్టు ప్యాక్లో ఉంచారు.
కాగా, 'భరత్ అనే నేను' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు నటిస్తున్న తొలి పొలిటికల్ ఎంటర్టెనర్ ఇది. ఇందులో ఆయన ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నారు. మహేష్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది.
రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో నిర్వహించారు. హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో 'భరత్ బహిరంగ సభ' పేరుతో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు వేలాది మంది అభిమానులు హాజరై విజయవంతం చేశారు.
భరత్ బహిరంగ సభకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కావడంతో మరింత హైప్ వచ్చింది. సభ ముగిసిన అనంతరం ఎన్టీఆర్, రామ్ చరణ్, చిత్ర బృందాన్ని తన ఇంటికి ఆహ్వానించి గ్రాండ్ ట్రీట్ ఇచ్చారు మహేష్ దంపతులు.