Don't Miss!
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- News ఏపీలో కూటమికి వచ్చే సీట్లు ఇవే- రఘురామ తాజా అంచనా..!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’
పృథ్వీ, నవీన్చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన హిలేరియస్ ఎంటర్టైనర్ 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ - ''మా చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ఈమధ్యకాలంలో ఇలాంటి చక్కని ఎంటర్టైనర్ని చూడలేదని, సినిమా చాలా బాగుందని సెన్సార్ సభ్యులు ప్రశంసించారు. అన్నివర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేసే ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందింది. ఆడియోకి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. వసంత్ ఈచిత్రానికి సూపర్హిట్ మ్యూజిక్ని ఇచ్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నవంబర్లోనే ఈ చిత్రాన్ని వరల్డ్వైడ్గా విడుదల చేయాలని ప్లాస్ చేస్తున్నాం'' అన్నారు.