Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సొమ్మసిల్లి పడిపోయిన నటి మీనా...
ఈ చిత్రంలో మోహన్ లాల్, మీనా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఉన్నట్టుండి మీనా స్పృహ తప్పి పడిపోవడంతో యూనిట్ సభ్యులంతా కంగారు పడ్డారు. షూటింగుకు వచ్చినప్పటి ఆమె అనారోగ్యంగా కనిపించారని, అనారోగ్యాన్ని లెక్క చేయకుండా షూటింగులో పాల్గొనడం వల్లనే ఇలా జరిగిందని భావిస్తున్నారు.
ఆమెను పరీక్షించిన వైద్యులు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. ఈ సంఘటనతో 'ద్రిశ్యం' మూవీ షూటింగ్ నిలిపివేసారు. అనారోగ్యం నుంచి మీనా కోలుకున్న తర్వాత షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో మీనా, మోహన్ లాల్ భార్య పాత్రలో నటిస్తున్నారు.
'ద్రిశ్యం' సినిమా షూటింగ్ ఆగిపోవడంతో నటుడు మోహన్ లాల్....తను నటిస్తున్న మరొక మళయాలం మూవీ 'గీతాంజలి' పోస్టు ప్రొడక్షన్ పనుల్లో పాలు పంచుకుంటున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం మోహన్ లాల్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంటున్నారు.