Don't Miss!
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- News సీటు త్యాగం చేసిన ఆ ఎమ్మెల్యేకు జగన్ రాజ్యసభ హామీ-బహిరంగ ప్రకటన..!
- Sports RCB vs KKR: సారీ.. మా ఆటగాళ్ల పేర్లు మరిచిపోయా: శ్రేయస్ అయ్యర్ వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
సైలెంట్గా అప్లై అవుతున్న మెగాస్టార్ నిర్ణయాలు.. న్యూస్ ఛానల్స్కు దిమ్మతిరిగేలా!
మెగాస్టార్ చిరజీవి ఇటీవల టాలీవుడ్ ప్రముఖులందరితో సీక్రెట్ గా సమావేశం ఏర్పరచిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలు, వాటి నివారణకు తీసుకోవలసి చర్యల గురించి మెగాస్టార్ స్టార్ హీరోలందరితో సమావేశమై చర్చించారు ఈ సమావేశంలో న్యూస్ ఛానల్స్ కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో నిర్ణయాల్ని ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. మీడియా సంచలనం శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ పై చేసిన దారుణమైన వ్యాఖ్యల అంనతరం టాలీవుడ్ లో కదలికలు మొదలయ్యాయి. పవన్ ఫిలిం ఛాంబర్ లో హడావిడి చేసిన తరువాత చిరు సైలెంట్ గా టాలీవుడ్ ప్రముఖతో సమావేశం నిర్వహించారు. టాలీవుడ్ లో ప్రస్తుతం సైలెంట్ రివల్యూషన్ మొదలైనట్లు తెలుస్తోంది.
Recommended Video
న్యూస్ ఛానల్స్ దిగజారే విధంగా
కొన్ని తెలుగు న్యూస్ ఛానల్స్ తీరు ఈ మధ్య కాలంలో విసుగు తెప్పించే విధంగా సాగింది. అనవసరమైన వ్యవహారాల్ని హైలైట్ చేస్తూ, అర్థం లేని డిబేట్లని నిర్వహిస్తూ కొన్ని మీడియా సంస్థలు నానా హంగామా చేశాయి. తన తల్లిని దూషించడంతో పవన్ కళ్యాణ్ నేరుగానే కొన్ని మీడియా సంస్థలపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. టివి9, టీవీ5, ఏబీఎన్ ఛానల్స్ ని బహిష్కరించాల్సిందిగా అభిమానులకు పిలుపు ఇచ్చారు.
టాలీవుడ్ని ఏకం చేసిన మెగా క్యాంప్
శ్రీరెడ్డి, వర్మ పైకి కనిపిస్తున్న పావులు మాత్రమే అని దీనివెనుక చాలా కుట్ర దాగివుందని అల్లు అరవింద్ నేరుగా ఆరోపించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా యుద్ధం మొదలుపెడితే, అల్లు అరవింద్, నాగబాబు, మెగాస్టార్ చిరంజీవి మీడియా ఆగడాలని అరికట్టడానికి వ్యూహం రచించి టాలీవుడ్ ని ఏకం చేసారు.
చిరంజీవి నిర్ణయాలు
మెగాస్టార్ చిరంజీవి నిర్వహించిన సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మొదట సదరు మీడియా సంస్థల్ని బహిష్కరించాలని భావించినా దానికి ఆమోదం లభించలేదు. దీనితో మరో ప్రతిపాదన ఆమోదం లభించిందట. మీడియా ముఖాముఖీ ఇండస్ట్రీ వ్యవహారాల్ని పంచుకోవద్దని, సినిమాలని సొంతంగానే ప్రమోట్ చేసుకోవాలని చిరు సూచించారట.
ఎవరు పడితే వారు
ఎవరు పడితే వారు వెళ్లి టివి ఛానల్స్ డిబేట్లలో పాల్గొనుతుండడంతో సమస్య మరింత పెద్దదిగా మారుతోంది. మా అసోసియేషన్ సభ్యులందరికి ఇటీవల లెటర్స్ పంపించారట. కేవలం కొందరిని మాత్రమే అధికారిక స్పోక్స్ పర్సన్ లని నియమిస్తామని, మిగిలిన వారెవరూ ఇండస్ట్రీకి సంబందించిన విషయాలని మీడియాతో పంచుకోకూడదని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ కంట్రోలింగ్ కమిటీ
అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి సూచన మేరకు కొందరు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో టాలీవుడ్ కంట్రోలింగ్ కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కమిటీలో తమ్మారెడ్డి భరద్వాజ, కొందరు దర్శకులు, నిర్మాతలని సభ్యులుగా నియమించనున్నారు.