Don't Miss!
- News
కోటంరెడ్డి కీలక నిర్ణయం - రిటర్న్ గిఫ్ట్..!!
- Finance
Infosys: ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ ఝలక్..! ఉద్యోగాల తొలగింపు.. ఆ టెక్నిక్ వాడుతూ..
- Travel
వైజాగ్ సమీపంలోని సందర్శనీయ పర్యాటక ప్రదేశాలు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Sports
INDvsAUS : స్పిన్నర్ల ఎంపికపై ఆసీస్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
అల్లు రామలింగయ్య జయంతి: చిరంజీవి నివాళి(ఫోటో)
ప్రముఖ సినీ హాస్యనటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య 93వ జయంతి సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ నివాళులర్పించారు. రాజేంద్రనగర్ మండలం కోకాపేట శాంతినగర్ కాలనీలోని అల్లు రామలింగయ్య సమాధి వద్ద వారు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
అల్లు
రామయ్య
గురించి....
పశ్చిమ
గోదావరి
జిల్లా
పాలకొల్లు
లో
1922
అక్టోబర్
1న
అల్లు
రామలింగయ్య
జన్మించాడు.
చదువు
పెద్దగా
అబ్బలేదు.
తన
సహచరులతో
కలసి
ఆకతాయిగా
తిరుగుతూ
అందరినీ
అనుకరిస్తూ
నవ్వించేవాడు.
ఇదే
క్రమంతో
నాటకాల్లో
నటించాలనే
ఉత్సాహం
పెరిగింది.
ఊళ్లోకి
ఎవరు
నాటకాల
వాళ్ళు
వచ్చినా
వారి
వెంటే
తిరుగుతూ
ఉండేవాడు.
వాళ్లతో
స్నేహం
చేయడం,
ఏదైనా
చిన్న
వేషం
ఇమ్మని
అడగడం
నిత్యకృత్యంగా
చేసుకున్నాడు.
ఎట్టకేలకు
భక్త
ప్రహ్లాద
నాటకంలో
బృహస్పతి
వేషం
వేసే
అవకాశం
వచ్చింది.
అదీ
మూడు
రూపాయలు
ఎదురిచ్చేట్టుగా
ఇంట్లో
వాళ్ళకి
తెలియకండా
వేసాడు.
నాటకానుభవం
పెద్దగా
లేకున్నా
కొద్దిపాటి
నటనావగాహనతో
తన
వేషం
మెప్పించాడు.
ఆ
తరువాత
ఇంట్లోంచి
బియ్యం
దొంగతనం
చేసి
వాటిని
అమ్మి
నాటక
కాంట్రాక్టరుకు
ఇచ్చాడు.
అలా
మొదలైనంది
ఆల్లు
నట
జీవితం.

అల్లు నాటకాల్లో నటిస్తూనే, తన సామాజిక బాధ్యతను గుర్తెరిగి గాంధీజీ పిలుపునందుకుని క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు కెళ్లాడు. జైలులో కూడా తోటివారిని పోగేసుకుని నాటకాలాడేవాడు. అల్లు నాటాకాలు చూసిన గరికపాటి రాజారావు చిత్రసీమలో తొలిసారిగా 1952 లో పుట్టిల్లు చిత్రంలో కూడు-గుడ్డ శాస్త్రి తరహ పాత్రను అల్లుచే వేయించాడు. ఆ తరువాత హెచ్.ఎం.రెడ్డి ' వద్దంటే డబ్బు ' లో అవకాశం వచ్చింది.
హాస్య నటుడిగా ఎదిగారు. అల్లు హాస్యపు జల్లునేకాదు కామెడీ విలనిజాన్ని కూడా బగా రక్తికట్టించాడు. అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలలో ఆణిముత్యాలుగా చెప్పుకోదగ్గవి మూగమనసులు, దొంగరాముడు, మాయా బజార్,ముత్యాల ముగ్గు, మనవూరి పాండవులు, అందాలరాముడు, శంకరాభరణం మొదలైనవి వున్నాయి. ముత్యాలముగ్గు సినిమా చిత్రీకరణకు ముందు ఆయన కుమారుడు ఆకస్మికంగా మరణించినా బాధను మనసులో అణుచుకుని షూటింగ్ లో పాల్గొన్న గొప్ప నటుడు అల్లు. సుమారు 1030 సినిమాల్లో కామెడీ విలనీ, క్యారెక్టర్ పాత్రలు చేసాడు. 1116 చిత్రాల్లో నటించాలనే కోరిక ఆయనకు తీరలేదు. ఆతను అభినయించిన చాల పాటలకు బాలు గళం సరిగా అమరి పోయింది. ' మనుషులంతా ఒక్కటే ' చిత్రంలో 'ముత్యాలు వస్తావా అడిగిందీ ఇస్తావా అనే పాట అప్పట్లో హిట్.